ఇన్నాళ్లు వివాదాస్పద వ్యాఖ్యలు.హాట్ వీడియోలు ఫొటోలలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన శ్రీరెడ్డి ప్రస్తుతం గేర్ మార్చింది.
ఇక టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్తో తీవ్ర దుమారాన్ని రేపిన శ్రీరెడ్డి, ఒక్కసారిగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.ఆ తర్వాత కూడా ఆమెకు పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో చెన్నైకి మకాం మార్చింది.
ఇకపోతే ఆమె ఇటీవల జరిగిన మా అసోసియేషన్ ఎన్నికలపై స్పందించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అన్యాయం జరిగిందంటూ గగ్గోలు, మీరు గెలిచి ఉండుంటే బ్యాలెట్ అలా అయినవి.
లేకపోతే, వాళ్లు మమ్మల్ని అన్యాయం చేశారు.మమ్మల్ని కొట్టారు.
మమ్మల్ని గిల్లారు.మమ్మల్ని కొరికారు.
ఇలా ఏడ్చేవాళ్లా మీరు ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు నటి శ్రీరెడ్డి.మా అసోసియేషన్లో ఇప్పుడెందుకు ఏడుస్తున్నారు ? అసలైన అన్యాయాల గురించి ఏడవాలి.అసలైన అన్యాయాల గురించి, మానభంగాల గురించి, స్త్రీల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి నోరు విప్పినపుడు, కంటి తుడుపుకైనా ఒక్కళ్లు రాలేదు.ఈ రోజు పదవి కోసం ఇంతమంది గుక్కపట్టి ఏడుస్తున్నారు.
సిగ్గుండాలి మీ అందరికీ అంటూ అందరూ ఆశ్చర్యపోయే విధంగా సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు ఆమె.
ఇదిలా ఉండగా, ఇక నటి హేమ గారు.ఒంటి మీద బట్టలు ఎక్కడున్నాయో కూడా తెలియదు అంటూ శ్రీరెడ్డి ఊహించని రీతిలో మాటలు వదిలారు.అటు ఇటు పరుగులు, ఇక ఆ ప్రగతి గారు.ఆ గంతులేసేటపుడు చీరలు ఎక్కడికెక్కడి ఎగురినవో.అసలు ఎందుకింత వ్యామోయమో ఆ పదవి మీద నా కర్థం కాలేదు అంటూ తనకిష్టమొచ్చిన విధంగా సినీ నటులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు శ్రీరెడ్డి.
సేవే పరమార్థం అనుకుంటే, ఇందులో మాకొచ్చేది ఒక్క రూపాయి కూడా ఉండదు.మేము అందరికీ సేవ చేసుకోవడానికే అంటే, అంత మంచి ఉద్దేశం ఉన్న మీరు ఎందుకంత కొట్టుకుంటున్నారు ? ఒక సేవే కదా చేయాల్సింది.అది ఎవరో ఒకరు చేస్తారు అంటూ ఆమె నిప్పులు చెరిగారు.ఎందుకింత పబ్లిసిటీ స్టంట్లు చేయడం అంటూ ఆవేశం వెల్లగక్కారు.ఒకప్పుడు తాను చేసేది పబ్లిసిటీ స్టంట్లు అన్నారు కదా .మరి ఇప్పుడు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ చేస్తుందేంటో తనకు అర్థం కావట్లేదని శ్రీరెడ్డి కోపం వ్యక్తం చేశారు.
ఇకపోతే తాజాగా తన యూట్యూబ్ ఛానల్ను స్టార్ట్ చేసిన శ్రీరెడ్డి.ఫాలోవర్స్ని పెంచుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది.దీనిలో భాగంగా వివిధ వంటలు, హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్తో పాటు దాంపత్య జీవితంలో తలెత్తే సమస్యలు వాటి పరిష్కాలపై వరుస వీడియోలను కూడా పోస్ట్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఇదిలా ఉండగా దివంగత నటి సిల్క్స్మిత జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్లో శ్రీరెడ్డి లీడ్ రోల్ పోషించనుంది.ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అధికారికంగా ఇప్పటికే వెల్లడించారు.గత కొన్ని రోజులుగా గుడ్న్యూస్ చెబుతానంటూ ఊరిస్తున్న శ్రీరెడ్డి ఎట్టకేలకు సన్సెస్ను రివీల్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
దిగ్గజ నటి సిల్క్ స్మిత బయోపిక్ చేస్తున్నానని, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది.మధు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుందని ఆమె అప్పట్లో వివరించారు.
మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని కూడా శ్రీరెడ్డి తెలిపారు.