ఇక మీదట ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ప్రకటించిన తరువాత ఆ పార్టీ నాయకులకు పని లేకుండా పోయింది.కొంతకాలం రాజకీయాల రుచి మరిగిన నాయకులు జేపీ నిర్ణయంతో నిరాశ పడ్డారు.
రాజకీయాలలో కొనసాగాలని నిర్ణయించుకున్న ఈ పార్టీలోని కొందరు నాయకులు ఒక వేదికను ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
లోక్ సత్తాలో కీలకంగా వ్యవహరించిన దీవీవీఎస్ వర్మ నాయకత్వంలో కొత్త వేదిక ఏర్పాటు కాబోతున్నది.
దీనికి కొత్త పేరు పెడతారు.కొత్త వేదిక అంటే రాజకీయ పార్టీయే.
త్వరలో పార్టీ ముసాయిదా తయారు చేస్తామని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు కటారి శ్రీనివాస రావు చెప్పారు.తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త పార్టీ పుట్టబోతున్నది.
దీని భవిష్యత్తు ఎలా ఉంటుందో.