టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్ కి లెటర్ రాశారు.గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి రైల్వే స్థలాల్లో ఉన్న వారికి ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ మేరకు.
వేరే చోట ఇల్లు నిర్మించుకునేందుకు.సహాయం చేసే వరకూ రైల్వే అధికారులు… ఇల్లు కూల్చకుండా.
సమయం పొడిగించేలా తక్షణమే.రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీఎం జగన్ కి లెటర్ రాశారు.40 సంవత్సరాల నుండి ఇల్లు కట్టుకుని నివసిస్తున్న అట్టడుగు వర్గాలకు ఒక్క రోజులో.ఇల్లు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు పంపటం.
దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది.2019 ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే మరియు వైసీపీ పార్టీ నాయకులు ఈ రైల్వే స్థలంలో.ఉన్న పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.వీళ్ళ జీవనోపాధి కూలి కేలితే గాని కూడు దొరకని పరిస్థితి.నిరుపేదలైన ఈ 650 కుటుంబాల సమస్యని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని తెలిపారు.మీ అమ్మాయిలు ఇచ్చిన హామీ మేరకు 650 కుటుంబాలకు వేరే చోట ఇల్లు కట్టి తరలించే వరకు ఇక్కడే నివాసం ఉండేలా.
రైల్వే అధికారులను ఒప్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని.లోకేష్ లెటర్లో స్పష్టం చేశారు.