టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ఇటీవల పారిశ్రామిక మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబాయ్ లో ప్రముఖ కంపెనీల తో ఏంవోయు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు.
వైసీపీ ప్రభుత్వం చేస్తున్న హడావిడి పై మండి పడ్డారు.దుబాయ్ ఎక్స్ పో వేదికగా ఖాళీ కుర్చీలతో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఉత్పత్తి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని హడావిడి చేస్తున్నారని సీరియస్ ఆరోపణలు చేశారు.ఈ క్రమంలో దుబాయ్ ఎక్స్ పో వేదికగా తాము బయటపెట్టిన విషయాలు గురించి అందుకే వైసీపీ నేతలు స్పందించడం లేదని లోకేష్ సోషల్ మీడియాలో తనదైన శైలిలో రెచ్చిపోయారు.
‘కళ్లు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదని పిల్లి అనుకున్నట్టు… దుబాయ్ ఎక్స్ పోలో షెల్ కంపెనీలతో డొల్ల ఒప్పందాలు కుదుర్చుకుని ఎవ్వరికీ తెలియదు అనుకున్నారు గౌరవ మంత్రి మేకపాటి గౌతం గారు.
ఉత్తుత్తి కంపెనీతో జరిగిన ఉత్తుత్తి ఒప్పందాన్ని, 3 లక్షల రూపాయలు కూడా లేని కంపెనీ పెడతామన్న 3 వేల కోట్ల రూపాయల పెట్టుబడి లోగుట్టుని టీడీపీ బయటపెట్టింది.మంత్రి, సర్కారు పెద్దలు తేలుకుట్టిన దొంగల్లా స్పందించడంలేదు’ అని.సోషల్ మీడియాలో లోకేష్ వైరల్ పోస్ట్ పెట్టారు.