టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్ననీ … ఆయన నివాసంలో విజయవాడ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే.మంత్రి కొడాలి నాని నీ విమర్శించడంతో బుద్ధా వెంకన్న పై 153, 505, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది.
దీంతో బుద్ధా వెంకన్న అరెస్టు పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు.తాజాగా నారా లోకేష్ స్పందించారు.
బుద్ధ వెంకన్న అరెస్ట్ పట్ల ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరును తప్పు పట్టారు.
గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని క్యాసినో నడిపితే నో పోలీస్.? అదే గడ్డం ల్యాండ్ ప్రతిపక్షనేత ని బూతులు తిడితే నో పోలీస్.? చంద్రబాబు గారి ఇంటి పై దాడి చేస్తే నో పోలీస్.? టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయం పై వైసీపీ నాయకులు మూకుమ్మడిగా దాడి చేస్తే నో పోలీస్.అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. “సింహా” సినిమా లో బాలకృష్ణ చెప్పిన డైలాగ్ తో ఏపీ పోలీసుల పై లోకేష్ తనదైన శైలిలో మండి పడ్డారు.బూతులు ఏంటి రా సన్నాసి అని నాని నీ బుద్ధ వెంకన్న నిలదీస్తే పోలీసులు వచ్చి అరెస్టు చేయటం దారుణమని అన్నారు.
ఏపీ పోలీసులు ప్రజల పక్షాన ఉన్నారా.? లేకపోతే నేరాలు చేసే వైసీపీ నాయకులు వైపు ఉన్నారా.? అంటూ విమర్శల వర్షం కురిపించారు.బుద్ధా వెంకన్న అరెస్టును తీవ్రంగా ఖండించారు.
ఏపీ పోలీసులు వైసీపీ పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారని.లోకేష్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.