తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు రాజకీయ వారసులు ఎమ్మెల్సీ నారా లోకేష్ గట్టిగానే పోరాడుతున్నారు.వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ప్రతి విషయం పైన స్పందిస్తున్నారు.
వైసీపీలో నాయకులు చేసే తప్పులను ఎత్తిచూపుతూ, పదే పదే విమర్శలు చేస్తున్నారు.ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను గుర్తించి రాజకీయంగా ఉపయోగించుకుంటూ వైసీపీ పై విమర్శలు దాడి చేస్తూ పార్టీలో కొత్త ఉత్సాహం పెరిగే విధంగా చేయడంతోపాటు , చంద్రబాబు తర్వాత ఆ స్థాయి నాయకుడు అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఇదంతా సోషల్ మీడియా ద్వారా మాత్రమే చేస్తున్నారు.నేరుగా ప్రజల్లోకి వచ్చి, జిల్లాల్లో పర్యటనలు చేస్తూ, నిత్యం ఏపీ లోని పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటూ, ప్రభుత్వంపై పోరాడితే ఆ వచ్చే కిక్ వేరేగా ఉంటుంది.
కానీ ఇప్పటికీ లోకేష్ బాబు ట్విట్టర్ ను మాత్రమే నమ్ముకున్నారు.అప్పుడప్పుడు స్క్రిప్టులు రాయించుకుని బట్టి బట్టి ప్రసంగాలు చేయాల్సి వస్తోంది.ఇప్పుడు జరిగిన సంఘటనలు ఉదాహరణ సమయంలో తేదీలతో సహా చెప్పేందుకు ప్రయత్నిస్తూ, ఆ తేదీలను తప్పుగా లోకేష్ చెబుతూ నవ్వులపాలు అవుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.ఇక ఆకట్టుకునే విధంగా చిన్న బాబు ప్రసంగాలు లేకపోవడం, పదే పదే తప్పులతడకగా ప్రసంగాలు చేస్తూ, ఏదో స్క్రిప్ట్ చదువుతున్నాడు అన్న ఫీలింగ్ కల్పించేలా ఆయన ప్రసంగాలు ఉండడం ఇలా ఎన్నో కారణాలతో లోకేష్ బాబు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇటువంటి వ్యవహార శైలితో లోకేష్ జనాల్లోకి నే కాదు పార్టీ నాయకులను నమ్మకం కలిగించే లేక పోతున్నారు.చంద్రబాబు అంతటి రాజకీయ శక్తి సామర్ధ్యాలు లోకేష్ కు ఇక ఎప్పటికీ రావు అనే ఫీలింగ్ కల్పించేస్తున్నారు.జగన్ కు ఉన్న మాస్, క్లాస్ ఫాలోయింగ్ ను లోకేష్ సంపాదించుకోలేకపోతే రాజకీయంగా ఎన్నెన్నో ఎదురుదెబ్బలు తినాల్సిందే.అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోంది నాయకులు పూర్తిగా భరోసా కోల్పోయారు.
ఎక్కడికక్కడ పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.ఈ సమయంలో పార్టీకి చినబాబు రిపేర్లు మొదలుపెట్టి సైకిల్ ను సరైన రూట్లో వెళ్లేలా చేయకపోతే పార్టీనే కాదు, చినబాబు సైతం ఇబ్బందులు పడాల్సిందే.