ప్రస్తుతం సౌత్ లో మంచి బజ్ ఉన్న దర్శకులలో లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు.ఈ యంగ్ దర్శకుడు ఖైదీ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.
రీసెంట్ గా ఇళయదళపతి విజయ్ తో మాస్టర్ సినిమా చేసి మరో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతికి విలన్ గా చూపించాడు.
ఇదిలా ఉంటే లోకేష్ ప్రస్తుతం కమల్ హసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది.
ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలు జరుగుతూ ఉండటంతో కమల్ హసన్ సినిమాని కొంత కాలం వాయిదా వేశారు.ఇదిలా ఉంటే లోకేష్ తెలుగులో కూడా సినిమా చేయడానికి చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు.
మాస్టర్ సినిమా ప్రమోషన్ సమయంలోనే తెలుగు ఓ స్టార్ హీరోతో తన సినిమా ఉంటుందని క్లారిటీ కూడా ఇచ్చాడు.ఇదిలా ఉంటే ఆ స్టార్ హీరో రామ్ చరణ్ అని గతంలో ప్రచారం జరిగింది.
లోకేష్ రామ్ చరణ్ కి కథ చెప్పాడని అది అతనికి నచ్చడంతో ఆర్ఆర్ఆర్ తర్వాత చేయడానికి సిద్ధంయ్యాడని టాక్ వినిపించింది.అయితే రామ్ చరణ్ ఏకంగా స్టార్ దర్శకుడు శంకర్ తో సినిమాని ఎనౌన్స్ చేసేశాడు.
ఈ నేపధ్యంలో లోకేష్ చెప్పిన కథని హోల్డ్ లో పెట్టేశాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు లోకేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇళయ దళపతి విజయ్, మహేష్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.ఈ నేపధ్యంలో లోకేష్ విజయ్ కి ఒక కథ చెప్పి మహేష్ బాబుకి రికమండ్ చేయమని అడిగినట్లు తెలుస్తుంది.
ఇక విజయ్ కూడా లోకేష్ కథ గురించి మహేష్ కి చెప్పాడని టాక్ వినిపిస్తుంది.మరి ఇది ఎంత వరకు సెట్స్ వరకు వెళ్తుంది అనేది వేచి చూడాలి.