సౌత్ లో ప్రస్తుతం యంగ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి మంచి ఇమేజ్ ఉంది.ఖైదీ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన ఈ దర్శకుడు వెంటనే ఇళయదళపతి విజయ్ తో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు.మాస్టర్ టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకి వచ్చి తెలుగులో ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న తమిళంలో మాత్రం సూపర్ హిట్ టాక్ తో ఏకంగా వంద కోట్ల షేర్ రాబట్టింది.50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా భీభత్సమైన కలెక్షన్ రాబట్టడం విశేషం.ఈ సినిమాలో మొదటి సారి విజయ్ సేతుపతిని విలన్ గా లోకేష్ చూపించి పెద్ద సాహసం చేశాడు.ఇది భాగా వర్క్ అవుట్ అయ్యింది.దీంతో తమిళంలో సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.విజయ్ కెరియర్ లో కూడా బెస్ట్ మూవీగా ఈ సినిమా నిలిచిపోయింది.
ఇదిలా ఉంటే మాస్టర్ సినిమా హిట్ కావడంతో హీరో విజయ్ లోకేష్ తో మరో సినిమా చేయడానికి ఒకే చెప్పేశాడు.మంచి కథ సిద్ధం చేసుకోమని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.
విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉండగా లోకేష్ కనగరాజ్ కమల్ హసన్ తో విక్రమ్ అనే సినిమాని తెరకేక్కిస్తున్నాడు.ఈ సినిమాని కూడా తనకి అలవాటైన మాస్ హీరోయిజంతోనే లోకేష్ ప్లాన్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.వీరిద్దరి సినిమాలు పూర్తయిన తర్వాత లోకేష్ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉంటుందని కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది.
అయితే కమల్ హసన్ మూవీ తర్వాత లోకేష్ తెలుగులో రామ్ చరణ్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది.
ఈ నేపధ్యంలో రామ్ చరణ్ సినిమా చేస్తాడా లేదా విజయ్ తోనే లోకేష్ మళ్ళీ వెళ్తాడా అనేది వేచి చూడాలి.