ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలు సుప్రీంగా టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఉంటూ వచ్చారు.ఆయన మాటే వేదంగా పార్టీ శ్రేణులు పని చేశాయి.
బాబు మెప్పు పొందిన వారే ఎన్నో కీలక పదవులను సంపాదించుకున్నారు.అలాగే పార్టీలోనూ ఎన్నో కీలకమైన పొజిషన్ లో ఉన్నారు.
అయితే ఇప్పుడు టిడిపిలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.సర్వం లోకేష్ అన్నట్లుగా పరిస్థితి ఉంది.
దీనికి కారణం పూర్తిగా టిడిపి బాధ్యతలు లోకేష్ కు కట్టబెట్టడమే.చాలా రోజులుగా టిడిపి తరుపున లోకేష్ యాక్టివ్ గా ఉంటున్నారు.
తన తండ్రి చంద్రబాబు స్థాయిలో బలం పెంచుకునేందుకు, పార్టీ లో తన ముద్ర వేసేందుకు గట్టిగానే లోకేష్ కష్టపడుతున్నారు.సోషల్ మీడియా ద్వారా నిత్యం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అవకాశం దొరికినప్పుడల్లా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ తాను రాజకీయ అసమర్ధుని అనే ముద్రను చెరిపేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అలాగే పార్టీ నాయకులలోనూ నమ్మకం పెంచుకునేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు.అయితే రాబోయే రోజుల్లో తనకు ఎటువంటి రాజకీయ ఇబ్బందులు లేకుండా , పార్టీలో పూర్తిగా తన ముద్ర కనిపించాలంటే యువ నాయకులను ఎక్కువగా ప్రోత్సహించాలని , దీనికోసం పార్టీ సీనియర్లను పక్కన పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కొన్ని కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి యువ నాయకులకు లోకేష్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.వారిని 2024 ఎన్నికల్లో పోటీకి దింపాలని ఆయన డిసైడ్ అయ్యారట.అయితే ఆయా నియోజకవర్గాల్లో తమకే టిక్కెట్ అని ఆశలు పెట్టుకున్న సీనియర్లను పక్కన పెట్టేసాము అనే సంకేతాలు లోకేష్ ఇస్తున్నారట.
పార్టీలో ఇక పూర్తిగా తమ పెత్తనం కొనసాగుతుందని, చంద్రబాబు కూడా నామమాత్రంగానే వ్యవహరిస్తారనే సంకేతాలను ఆయన ఇస్తుండడం పై టిడిపి లో కొత్త చర్చ జరుగుతోంది.అయితే చాలా చోట్ల టిడిపి సీనియర్లను పక్కన పెట్టినా, వారి వారసులకు టికెట్ ఇచ్చేందుకు సముఖంగా ఉన్నారట.ఎలా చూసిన 2004 ఎన్నికల సమయంలో పూర్తిగా టిడిపి టికెట్ ల కేటాయింపు పూర్తిగా లోకేష్ కనుసన్నల్లో జరుగుతాయనే సంకేతాలు వచ్చేయడంతో ఆశావాహులు అప్పుడే లోకేష్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం లోకేష్ వ్యవహారంపై టిడిపిలో చర్చ జరుగుతోంది.