ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొన్నటి వరకు ఆలయాల చుట్టూ తిరగా.ఇప్పుడు దీక్షలు అంటూ అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీ టిడిపి నేతలు ఒకరిపై ఒకరు ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ ని ఉద్దేశించి కొత్త పేరుతో విమర్శించారు.మేటర్ లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మండలం లో వింత వ్యాధి వలన 28 మంది అనారోగ్యానికి గురి అవ్వటం అందరికీ తెలిసిందే.
గతంలో ఏలూరులో ఇదే రీతిలో వింత వ్యాధి రావడంతో దాదాపు 600 మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది.కారణం తెలియకుండా కళ్లు తిరిగి పడిపోవడం తో పాటు మూర్ఛ రావటంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెన్షన్ పడ్డాయి.
అయితే తర్వాత నీటి కాలుష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చినట్లు తరువాత కేంద్ర మరియు రాష్ట్ర వైద్య బృందాలు తెలిపాయి.తాజాగా మళ్లీ ఇదే రీతిలో భీమవరంలో సంభవించడంతో లోకేష్ సీరియస్ అయ్యారు.
ఏలూరు లో ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు వచ్చింది మళ్ళీ అదే జిల్లాలో రావడమంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని.ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బూమ్ బూమ్ జగన్ రెడ్డికి ఫేక్ మద్యం అమ్ముకోవడం పై ఉన్న శ్రద్ధ ప్రజలకు సురక్షిత త్రాగు నీరు అందించడంపై లేదని సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వం మెరుగైన త్రాగు నీరు అందిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని స్పష్టం చేశారు.