సీఎం జగన్ ని కొత్త పేరుతో విమర్శించిన లోకేష్..!!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొన్నటి వరకు ఆలయాల చుట్టూ తిరగా.ఇప్పుడు దీక్షలు అంటూ అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీ టిడిపి నేతలు ఒకరిపై ఒకరు ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు.

 Nara Lokesh Criticizes Ap Govt,ap Govt,nara Lokesh, Ys Jagan, Eluru Disease-TeluguStop.com

ఇలాంటి తరుణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్ ని ఉద్దేశించి కొత్త పేరుతో విమర్శించారు.మేటర్ లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం మండలం లో వింత వ్యాధి వలన 28 మంది అనారోగ్యానికి గురి అవ్వటం అందరికీ తెలిసిందే.

గతంలో ఏలూరులో ఇదే రీతిలో వింత వ్యాధి రావడంతో దాదాపు 600 మంది హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది.కారణం తెలియకుండా కళ్లు తిరిగి పడిపోవడం తో పాటు మూర్ఛ రావటంతో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెన్షన్ పడ్డాయి.

అయితే తర్వాత నీటి కాలుష్యం వల్ల ఈ పరిస్థితి వచ్చినట్లు తరువాత కేంద్ర మరియు రాష్ట్ర వైద్య బృందాలు తెలిపాయి.తాజాగా మళ్లీ ఇదే రీతిలో భీమవరంలో సంభవించడంతో లోకేష్ సీరియస్ అయ్యారు.

ఏలూరు లో ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు వచ్చింది మళ్ళీ అదే జిల్లాలో రావడమంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని.ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బూమ్ బూమ్ జగన్ రెడ్డికి ఫేక్ మద్యం అమ్ముకోవడం పై ఉన్న శ్రద్ధ ప్రజలకు సురక్షిత త్రాగు నీరు అందించడంపై లేదని సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వం మెరుగైన త్రాగు నీరు అందిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని స్పష్టం చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube