ఏసీ సీఎం చంద్రబాబు తనయుడు రాజకీయ ఎంట్రీపై ఎప్పటి నుంచో రకరకాల వార్తలు వచ్చాయి.లోకేశ్ ముందు ఎమ్మెల్సీ అవుతారా ? ఎమ్మెల్యే అవుతారా ? బాబు కేబినెట్లో ఆయనకు ఎంట్రీ ఉంటుందా ? లేదా ? అని రకరకాల చర్చలు జరిగాయి.చివరకు లోకేశ్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.ఆయన త్వరలోనే కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వడం కూడా కన్ఫార్మ్ అయ్యింది.ఇక్కడి వరకు బాగానే ఉంది.ఏపీలో 2019 ఎన్నికలకు చూడడానికి రెండేళ్లు కనిపిస్తున్నా… మహా అయితే మరో యేడాది తర్వాత ఎన్నికల వేడి స్టార్ట్ అవుతుంది.
ఇక లోకేశ్ వచ్చే ఎన్నికల నాటికి ఎమ్మెల్సీగా ఉన్నా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగకపోతే అనేక రకాల విమర్శలు ఎదుర్కొనే ఛాన్స్ ఉంది.అప్పటకీ లోకేశ్ మంత్రిగా కూడా ఉంటాడు…మంత్రిగా ఉండి నేరుగా ఎమ్మెల్యేగా పోటీచేయకపోతే అది లోకేశ్ రాజకీయ సమర్థతకే సవాల్గా మారుతుంది.
ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో లోకేశ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న టాక్ నడుస్తోంది.
లోకేశ్ 2019లో తన సొంత జిల్లా, తన తండ్రి ప్రాథినిత్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
చంద్రబాబు సైతం లోకేశ్ను టీడీపీకి బలమైన కంచుకోటగా ఉన్న కుప్పం నుంచి పోటీ చేయించి…తాను ఎన్టీఆర్ పుట్టిన గడ్డ, ఆయన గతంలో ప్రాథినిత్యం వహించిన కృష్ణా జిల్లా గుడివాడ నుంచి బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
గుడివాడ నుంచి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రాథినిత్యం వహిస్తున్నారు.
ఇక్కడి నుంచి టీడీపీ తరపున బరిలో ఉండేందుకు ఎవ్వరూ సుముఖంగా లేరు.ఈ క్రమంలోనే గుడివాడను తిరిగి టీడీపీ అడ్డాగా మార్చేందుకు చంద్రబాబే స్వయంగా బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నట్టు టీడీపీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.
చంద్రబాబు ఇక్కడ నుంచి బరిలో ఉంటే ఆ ఎఫెక్ట్ కృష్ణా, గుంటూరు జిల్లాలపై బలంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.