ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుబాటి చెంచురామయ్య ఫ్యూచర్ గందరగోళంలో పడింది.చంద్రబాబుపై దగ్గుబాటి గత రెండు దశాబ్దాలుగా గుర్రుగా ఉండడం తప్పా ఏం చేయలేని పరిస్థితి.
బాబుతో విబేధించి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి ఇద్దరు కాంగ్రెస్లోకి వెళ్లారు.పురందేశ్వరి కేంద్ర మంత్రి అయ్యారు.
ఇక గత ఎన్నికల్లో పురందేశ్వరి బీజేపీ ఎంపీగా పోటీలో ఉంటే దగ్గుబాటి, ఆయన తనయుడు హితేష్ చెంచురామయ్య మాత్రం వైసీపీలో ఉన్నారు.
ఆ ఎన్నికల్లో కుమారుడు చెంచురామయ్యను పరుచూరు ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేసినా అమెరికా పౌరసత్వం రద్దుకాకపోవడంతో కుదర్లేదు.
దీంతో తానే స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్తిగా పోటీ చేసిన వెంకటేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేసిన ఏలూరి సాంబశివరావు చేతిలో ఓడిపోయారు.చివరకు భార్య, భర్త చెరో పార్టీలో ఉండడంతో జగన్ వెంకటేశ్వరరావును పరుచూరులో పక్కన పెట్టేశారు.
అటు పురందేశ్వరికి సైతం బీజేపీలో ఎలాంటి ప్రయార్టీ లేదు.రెండుసార్లు ఎంపీగా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు.
భార్య భర్తల రాజకీయం క్లైమాక్స్కు చేరడంతో ఇప్పుడు తన వారసుడు చెంచురామయ్య భవిష్యత్తుపై బెంగ పట్టుకుందట.ఇక బీజేపీ, వైసీపీ కాదు మళ్లీ తిరిగి తమ పాత పార్టీ అయిన టీడీపీలోకి వెళదామా ? అంటే ఈ ఫ్యామిలీని పార్టీలో చేర్చుకునే విషయంలో లోకేష్కు ఇష్టంగానే ఉన్నా… చంద్రబాబుకు మాత్రం ఇష్టం లేదనే అంటున్నారు.లోకేష్ మాత్రం తన అన్న పార్టీలో చేరితే తమకు ప్లస్ అవుతుందని.ఇకపై ఎలాంటి గొడవలు లేకుండా పార్టీ పటిష్టత కోసం కృషి చేసినట్లవుతుందని భావిస్తున్నారట.
ఇక ఇటీవల బాలయ్య షష్టిపూర్తికి ఇద్దరు తోడళ్లుల్లు కలిశారట.ఈ క్రమంలోనే దగ్గుబాటిని పక్కన పెడితే చెంచురామయ్య రాజకీయ భవిష్యత్తుపై చర్చ నడిచిందట.
ఇక్కడే మరోసారి వీరు టీడీపీలోకి వచ్చే అంశంపై చర్చ జరిగినా అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్కే ఫ్యూచర్ ఉన్నట్టు లేదు.ఇక సోదరుడు చెంచురామయ్య గురించి మాత్రం ఎవరు ఆలోచిస్తారనే అనుకోవాలి.