ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ వస్తున్నాడంటేనే మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఒక్కటే హడల్.యువరాజు ప్రాపకం కోసం నానా పాట్లు పడేవారు.
ఎమ్మెల్సీ అయిన మరునాడు మంత్రి అయిపోయిన లోకేష్ గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలోనే ఓడిపోయారు.ఇక కరోనా దెబ్బతో అసలు ఏపీ వైపు కన్నెత్తి చూసే సాహసమే చేయని బాబు, లోకేష్ ఇద్దరు ఇప్పుడిప్పుడే పార్టీ బతికే పరిస్థితి లేదన్న విషయం అర్థం చేసుకుని ఏపీకి వస్తున్నారు.
ఇద్దరు చెరోవైపులా వెళుతున్నారు.చంద్రబాబు ఓ వైపు పర్యటనలు చేస్తూ విద్వేషాలను రెచ్చగొట్టే ధోరణితో రాజకీయం చేస్తుంటే.ఆయన తనయుడు లోకేష్ మాత్రం ఓదార్పు పేరుతో రాజకీయం చేస్తోన్న పరిస్థితి ఉంది.ఇక టీడీపీ కార్యకర్తల హత్యలు జరిగిన చోట్ల పరామర్శలకు వెళుతోన్న లోకేష్ ఉగ్రరూపం ఎత్తుతున్నారు.
పొలిటికల్ ప్రసంగాలకు ట్రైనింగ్ తీసుకుంటోన్న లోకేష్ ఇప్పుడు వాటిని సినిమా స్టైల్లో పలుకుతోన్నట్టుగా సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
మామ బాలయ్యలా తొడకొట్టక పోవచ్చు కాని జగన్ రెడ్డి నీకు వార్నింగ్ అంటూ వీరావేశంతో ఊగిపోతోన్న పరిస్థితి ఉంది.తాజాగా గురాజల నియోజకవర్గంలో ఓ పార్టీ కార్యకర్తను హత్య చేస్తే అక్కడ అంతిమయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిన లోకేష్ జగన్ను టార్గెట్గా చేసుకుని సినిమా డైలాగులతో ఊగిపోయారు.ఈ ప్రసంగం మొత్తం జగన్కు వేలెత్తి చూపిస్తూ వార్నింగ్ ఇస్తోన్న పరిస్థితే ఉంది.
లోకేష్ ప్రసంగాలతో రాటు దేలడం కంటే నటనా పరంగా రాటు తేలిపోయాడని చాలా మంది చర్చించుకుంటున్నారు.ఓవరాల్గా లోకేష్ మామ బాలయ్య స్టైల్లో సినిమా డైలాగులు చెప్పడంతో పాటు మామకు పోటీ వచ్చేస్తాడనే లోకేష్ తాజా ప్రసంగాలపై సెటైర్లు పేలుతున్నాయి.
మరి లోకేష్ కనీసం ప్రసంగాలతో మెప్పించే విషయంలో అయినా ఎప్పటకీ సక్సెస్ అవుతాడో ? ఆయన రాజకీయం ఏ తీరాలకు చేరుతుందో ? అన్నది కాలమే నిర్ణయించాలి.