చినబాబు లోకేష్ ట్విట్టర్ పిట్ట అంటూ విపక్షాలు విమర్శలు చేస్తూ ఆయన పరువుని బజారున పడేస్తున్నాయి.అయినా లోకేష్ ఎక్కడా తొందరపడకుండా నిధానంగానే పార్టీలో తన పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే అవసరం వచ్చినప్పుడు మాత్రం అధికార పార్టీ నేతల మీద సంచలన వ్యాఖ్యలు చేసేరదుకు కూడా లోకేష్ వెనుకాడడంలేదు.తాజాగా ఇసుక వివాదంపై వైసీపీ ఎమ్యెల్యే ను ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలే చేసాడు లోకేష్.
ఇసుక కొరత కారణంగా ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడి ఆత్మహత్య చేసుకున్నబాధిత కుటుంబాలను పరామర్శించేందుకు లోకేష్ కర్నూల్ జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ భవన నిర్మాణ కార్మికులు దాసరి సుంకన్న,గొర్ల నాగరాజు కుటుంబాలను పరామర్శించారు.బాధిత కుటుంబాలకు లక్ష రూపాయిల చప్పున ఆర్థిక సహాయం అందించారు.
అనంతరం వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ఇసుక లేక భావన నిర్మాణ కార్మికులు చనిపోతుంటే వైసీపీ నాయకులు ఆ సమస్యలను పరిష్కరించడం మానేసి ఎదురుదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుకలో వాటాల కోసం ఎమ్మెల్యేలే కొట్టుకునే పరిస్థితి వచ్చిందని, రాజధాని అమరావతి సాక్షిగా ఒక ఎంపీ, ఎమ్మెల్యే కొట్టుకున్నారు అని అప్పుడు వారి మధ్య జగన్ పంచాయతీ చేసింది నిజం కాదా అంటూ లోకేష్ ప్రశ్నించారు.ఇసుక కొరతపై భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందిని గుర్తించి తాను ఇసుక దీక్ష చేపడితే తిన్నది అరగక తాను దీక్ష చేస్తున్నాని ఓ వైసీపీ ఎమ్యెల్యే అనడం సిగ్గుచేటని, అసలు అతనికి బుడ్డి ఉందా అంటూ లోకేష్ ఫైర్ అయ్యారు.