విదేశీ నిధులను స్వీకరించే ఎన్జీవోల రిజస్ట్రేషన్కు ఆధార్ను తప్పనిసరి చేసే బిల్లును లోక్సభ సోమవారం ఏకగ్రీవంగా ఆమోదించింది.దీని ప్రకారం.
విదేశీ విరాళాలు అందుకునే ఎన్జీవోలు, ఇతర సంస్థల్లోని ఆఫీసు బేరర్లు, డైరెక్టర్లు తదితర కీలక వ్యక్తుల ఆధార్ నంబర్ను.వారు విదేశీయులైతే పాస్పోర్ట్ ప్రతిని సమర్పించడం తప్పనిసరి.
ఈ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరపున హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఆదివారం సభలో ప్రవేశపెట్టారు.విదేశీ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) సవరణ బిల్లు, 2020, 2010లో విదేశీ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టం సవరణను కోరుతూ, ‘‘ ప్రభుత్వ ఉద్యోగులను’’ నిషేధిత విభాగంలో చేర్చాలని, ఒక సంస్థ విదేశీ నిధుల ద్వారా పరిపాలనా ఖర్చులను 50 శాతం నుంచి 20 శాతానికి తగ్గించాలని కేంద్రం ప్రతిపాదించింది.
ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష సభ్యుల నిరసనల మధ్యనే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదించింది.
అయితే, దీనిపై ప్రతిపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాలను అడ్డుకోవడానికే మోదీ సర్కారు ఈ బిల్లును ప్రవేశ పెట్టిందని వారు ఆరోపిస్తున్నారు.విదేశీ నిధులతో జరిగే సేవా కార్యక్రమాలకు ఈ బిల్లుతో ఆటంకం కలుగుతుందని, వాటిపై ప్రభుత్వ అజమాయిషీ పెరుగుతుందని పలు స్వచ్ఛంద సంస్ధలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా ఈడీ విరాజ్ పట్నాయక్ వంటి స్వచ్ఛంద సేవకులు, పౌర సమాజ నేతలు కూడా ఈ బిల్లులో ప్రతిపాదించిన సవరణలు సామాజిక సేవకు తీవ్ర విఘాతం కలిగించేవేనని మండిపడుతున్నారు.అయితే సమ్మతి యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, రశీదులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం ద్వారా మునుపటి చట్టం యొక్క నిబంధనలను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని నిత్యానంద్ రాయ్ సభకు వివరణ ఇచ్చారు.