రైల్వే ట్రాక్ మీద నడిచేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేదంటే పిలిచి మరి మృత్యువును ఆహ్వానించినట్టే.
ఎందుకంటే ట్రైన్ గుద్దిందంటే ఇక మృత్యు వడిలోకి వెళ్ళిపోయినట్టే.అందుకే రైల్వే ట్రాక్ మీద అటు నుండి ఇటు.ఇటు నుండి అటు దాటకూడదు.అది చాలా ప్రమాదం.
ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టే ట్రాక్ దాటడానికి వీలుగా వంతెనను నిర్మిస్తున్నారు అధికారులు.
కానీ దాని మీద ఎక్కి ఎవరు దాటుతారులే.
ట్రాక్ మీద అయితే ఈజీగా దాటవచ్చు అని కొంత మంది ఇలా తప్పు చేస్తూ ఉంటారు.కానీ అది ఎంత తప్పు అంటే ఇలాంటి వీడియోలు చూస్తే బాగా అర్ధం అవుతుంది.
ఇందులో ఒక ముసలాయన రైల్వే ట్రాక్ ను దాటుతున్న సమయంలో ట్రైన్ రావడం చూసుకోకుండా ట్రాక్ మీదకు వచ్చాడు.దీంతో లోకో పైలెట్ వెంటనే అప్రమత్తమయ్యారు.
వెంటనే ఎమెర్జెన్సీ బ్రేకులు వేసాడు.అయినా కూడా ఆ ముసలాయనను ట్రైన్ డీ కొట్టింది.
కానీ ట్రైన్ ఢీ కొట్టిన కూడా ఆ వ్యక్తి ప్రాణాలతో బయట పడ్డాడు.ఎలా అని అనుకుంటున్నారా.అవును నిజమే ఆయన ప్రాణాలతో బయట పడ్డాడు.కానీ ట్రైన్ ఇంజిన్ కింద చిక్కుకున్నాడు.వెంటనే అతడిని బయటకు తీశారు.ఈ ఘటన ముంబై లోని కళ్యాణ్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది.
ఒక వృద్ధుడు ట్రాక్ దాటుతూ ఉండగా ట్రైన్ వచ్చింది.అది చూడకుండా ట్రాక్ మీదే నిలబడిపోయాడు.వెంటనే లోకో పైలెట్ చూసి సకాలంలో స్పందించి ఎమెర్జెన్సీ బ్రేక్ వేసాడు.అయినా కూడా ఆ ముసలాయనను రైల్ డీ కొట్టింది.కానీ ట్రైన్ చిన్న రావడంతో అతడికి ఏమి కాలేదు.కానీ ఇంజిన్ కింద ఇరుక్కున్నాడు.
వెంటనే అప్రమత్తమయ్యి అతడిని సేఫ్ గా బయటకు తీశారు.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
మీరు కూడా చూసేయండి.