కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న విషయం విదితమే.ఇప్పటికే ఈ లాక్ డౌన్ వల్ల ఆర్థికరంగం పూర్తిగా కుదేలు అవుతుండడం తో సడలింపులతో కూడిన లాక్ డౌన్ ను కేంద్రం అమలు పరుస్తుంది.
లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో ఎత్తివేయకుండా సడలింపులు చేసుకొంటూ వ్యూహంతో కేంద్రం వ్యవహరిస్తోంది.అయితే ఇప్పటికే ఈ కరోనా దెబ్బకు అన్ని రంగాలు కుదేలు అయ్యాయి.
ముఖ్యంగా ఆటోమొబైల్ రంగం తీవ్రంగా దెబ్బతిన్నది.లాక్డౌన్ వల్ల ఎప్పుడూ ఎదుర్కొనని ఆర్థిక సవాలును ఎదుర్కొంటున్నది.
ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా లాక్డౌన్ వల్ల కలిగే నష్టాలను వివరించారు.ఇప్పటికే దేశం ఆర్థికంగా చాలా క్షీణించిందని, ఇంకా లాక్డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదంటూ ఆయన హెచ్చరిస్తున్నారు.
మళ్లీ లాక్డౌన్ పొడిగిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండబోదని, వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉందని ఆయన అంటున్నారు.అంతేకాకుండా ఈ లాక్డౌన్ను పొడిగిస్తే ప్రజల మానసిక ఆరోగ్యం పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది అని వ్యాఖ్యానించారు.
మరోపక్క ఇప్పటికే సడలింపులతో కూడిన లాక్ డౌన్ అమలు పరుస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నాలుగు రోజులుగా రోజుకు కనీసం 6 వేలకు పైగా కేసులు నమోదు అవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.
ఈ క్రమంలోనే లాక్డౌన్ పొడిగిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గదని, అందువల్ల ఆ దిశగా ఆలోచనలు విరమించి.ఆస్పత్రి బెడ్లు, ఆక్సిజన్ లైన్లను పెంచాల్సిన అవసరం ఉందని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.