తెలంగాణాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రతని నియంత్రించడానికి సీఎం కే.సి.
ఆర్ మే 12 నుండి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.ముందు 10 రోజులు అనగా మే 21 వరకు లాక్ డౌన్ పెట్టారు.ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు.21 నుండి మే 30 వరకు అదే విధంగా లాక్ డౌన్ కొనసాగించారు.అయితే మే 30 న జూన్ 9 వరకు మరోసారి లాక్ డౌన్ ప్రకటించారు.అయితే ఈసారి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు సడలింపులు ఇవ్వగా ప్రజలు గమ్యస్థానాలు చేరుకునేందుకు మరో గంట పర్మిషన్ ఇచ్చారు.
అంటే 2 గంటల నుండి మళ్లీ ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.
జూన్ 9 తో పూర్తవుతున్న లాక్ డౌన్ పై అదే విధంగా కొనసాగించాలా లేక కొన్ని సడలింపులు ఇవ్వాలా అని మరోసారి కేబినేట్ మీటింగ్ జరుగనుంది.
అయితే ఈ క్రమంలో తెలుస్తున్న సమాచారం ప్రకారం జూన్ 9 నుండి సడలింపులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని చెబుతున్నారు.ఐదు గంటల వరకు సడలింపు మరో గంట పాటు ప్రజలు వారి వారి ఇల్లకు చేరుకునే అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది.
రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తుంది.కేసులు అదుపులో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తుంది.