దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికి కోవిడ్ కేసులు మాత్రం ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు.ఇందుకు కారణం ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించక పోవడం అని చెప్పవచ్చూ.
ఇదిలా ఉండగా కోవిడ్ కేసుల్లో ఫాస్టుగా దూసుకెళ్లుతున్న కేరళలో విధించిన లాక్డౌన్ వల్ల అనుకున్న స్దాయిలో ఫలితం కనబడక పోవడంతో దీన్ని పొడిస్తున్నట్లుగా ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.
ఇక మే 8న ప్రారంభమైన లాక్డౌన్ వాస్తవానికి మే 16తో ముగియాల్సి ఉంది.
కానీ, కేసులు ఏమాత్రం తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట.ఇకపోతే తిరువనంతపురం, త్రిశూర్, ఎర్నాకుళం, మలప్పురంలో ఈ కరోనా మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్నందున మరో వారం ట్రిపుల్ లాక్డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది.
ఇప్పటికే కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న క్రమంలో మిగతా రాష్ట్రాలు కూడా కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.