దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.దీంతో అనేక రాష్ట్రాలలో పరిస్థితి చేయి దాటి పోయే విధంగా ఉండటంతో లాక్ డౌన్ ప్రకటిస్తూ ఉన్నాయి.
ఇప్పటికే మహారాష్ట్ర, ఢిల్లీ మరికొన్ని రాష్ట్రాలతో పాటు తాజాగా కర్ణాటక కూడా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.ఏప్రిల్ 27 నుండి అనగా రేపటి నుండి 14 రోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లోకి రానున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటన చేసింది.
ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అత్యవసర సర్వీసులకు అనుమతి మినహా .బయటకు ఎవరూ రాకూడదు అని కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది.
కరోనా సెకండ్ వేవ్ ఉద్రిక్తత దేశంలో అధికంగా ఉండటంతో చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్ పరిశీలన అమలుచేస్తూ మరికొన్ని చోట్ల కఠిన ఆంక్షలు విధిస్తూ ఉన్నాయి.అయితే కర్ణాటకలో కేసులు పెరిగిపోతూ ఉండటంతో .అక్కడి ప్రభుత్వం తాజాగా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.చాలా రాష్ట్రాలలో కేసులు పెరిగిపోతూ ఉండటంతో.
వైద్య సదుపాయం కరువయ్యే పరిస్థితి ఉండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ చేపట్టే ఆలోచన చేస్తున్నాయి.
.