ఈ మధ్యకాలంలో కొందరు తాము బడా రాజకీయ నేతలమని చెప్పుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి తనకు జాతీయ స్థాయి పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని తమకు ఎలాంటి సహాయం కావాలన్నా చిటికెలో చేసి పెడతానని మాయ మాటలు చెప్పి ఆటో డ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని కర్నూలు కి చెందిన ఆళ్లగడ్డ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు. అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై ఆటో నడుపుతూ ఉండేవాడు.
ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తి ఆటో డ్రైవర్ భార్య పై కన్నేశాడు. దీంతో ఆ వ్యక్తి మెల్లగా ఆటో డ్రైవర్ తో పరిచయం పెంచుకొని అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళుతూ వుండేవాడు.
ఈ క్రమంలో ఆటో డ్రైవర్ లేని సమయంలో ఇంటికి వచ్చి తన భార్యతో పలు మాయ మాటలు చెప్పి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి చివరికి ఆటోడ్రైవర్ చెవిన పడడంతో పలుమార్లు తన భార్యను ఈ విషయంపై హెచ్చరించినప్పటికీ ఆమె అతడి మాటలను ఖాతరు చేయలేదు.
అలాగే స్థానిక రాజకీయ నేతలకి కూడా చెప్పినప్పటికీ అతడి రాజకీయ పలుకుబడితో పలుమార్లు ఆటో డ్రైవర్ ని బెదిరించాడు. దీంతో తాజాగా తన భార్య మరియు తన ప్రియుడు ఏకాంతంగా గడుపుతున్న సమయంలో ఆటో డ్రైవర్ ప్రత్యక్షంగా పట్టుకొని పోలీసులకు సమాచారం అందించాడు.
దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక రాజకీయ నేతగా చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు.అంతేగాక వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని కాపురాలను బుగ్గిపాలు చేసుకోవద్దంటూ ప్రజలకు పోలీసులు సూచించారు.