విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో ప్రజాప్రతినిధుల రసాభాస

వికారాబాద్ జిల్లా తాండూరు:విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సభలో ప్రజాప్రతినిధుల రసాభాస.స్థానిక కౌన్సిలర్లను వేదికపైకి పిలవకపోవడంతో కింద కూర్చుని నిరసన వ్యక్తం చేసే వైనం.

 Local Counselors Protest At Minister Sabitha Indra Reddy Meeting In Tandoor Deta-TeluguStop.com

రూరల్ ప్రోగ్రామ్ ను అర్బన్ ప్రాంతం తాండూరు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు.వేదికపైన పట్టణానికి చెందిన ప్రజా ప్రతినిధులు కూర్చోవడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మండల ప్రజా ప్రతినిధులు.

తాండూరు పట్టణంలో ఏర్పాటు చేసినప్పుడు అధికారికంగా గా స్థానిక కౌన్సిలర్లు కచ్చితంగా పాల్గొంటారని వేదికపైకి ఎందుకు పిలవలేదు అంటూ స్థానిక కౌన్సిలర్ నీరజా బాల్ రెడ్డి నేలపై కూర్చొని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఒకానొక సందర్భంలో మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే రూరల్ ప్రజాప్రతినిధులు అలాగే తాండూరు అర్బన్ ప్రజాప్రతినిధుల మధ్య దూషణల పర్వం కొనసాగడం గమనార్హం.

ఈ సంఘటన పట్ల స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్థానిక కౌన్సిలర్ నీరజ బాల్రెడ్డి వేదికపైకి ఆహ్వానించడంతో గొడవ సర్దుమణిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube