ఇప్పుడు అంతా డిజిటల్ మయం అయిపోయింది.ఏది కొనాలన్నా.
ఏది అమ్మెయాలన్నా.పూర్తిగా ఇంటర్నెట్ ద్వారానే అయిపోతుంది.
దాంతో లిక్విడ్ క్యాష్ అవసరం రోజురోజుకు తగ్గుతోంది.దీంతో డిజిటల్ పేమెంట్ యాప్ లు పుట్టుకొస్తునే ఉన్నాయి.
తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తునే ఉన్నాయి.ఈ డిజిటల్ పేమెంట్ యాప్స్ లో ముఖ్యంగా పేటీఎం, ఫోన్ పే, జీపే.
ఎక్కువ మంది కస్టమర్లను కలిగి ఉన్నాయి.
అయితే ఇవి ఎప్పుడూ తమ కస్టమర్లను పెంచుకునేందుకు పలు ఆఫర్లు తెస్తూ.
ఉంటాయి.ఇప్పుడు అందులో భాగంగా పేటీఎం తమ కస్టమర్లకు మంచి ఆఫర్ ను ప్రకటిస్తోంది.
ఈ కొత్త సర్వీసుతో పేటీఎం పోస్ట్పెయిడ్ కస్టమర్లు తమ నెలవారి బిల్లును సులభంగా ఈఎంఐ రూపంలోకి మార్చుకోవచ్చు.అదే కాకుండా తక్కువ వడ్డీ రేట్లతోనే ఈ బెనిఫిట్ ను పొందొచ్చని సూచిస్తోంది.
పేటీఎం పోస్ట్పెయిడ్ యూజర్లు బిల్ ఈఎంఐ అనే ఫీచర్ తో ఎన్నో లాభాలు పొందొచ్చని సూచిస్తోంది.దీంతో పేటీఎం కస్టమర్లు తమ ఖర్చులను తక్కువ వడ్డీ రేట్లతో ఈఎంఐగా మార్చుకునే వేసులుబాటు ఉంది.
మాములుగా పేటీఎం పోస్ట్ పెయిడ్ కస్టమర్లు వాళ్లకు సంబంధించిన బిల్లులు జనరేట్ అయిన వారం రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.కానీ బిల్ ఈఎంఐ ఫీచర్ తో బిల్లు మొత్తాన్ని ఈఎంఐ లోకి ఈజీగా మార్చుకోవచ్చు.
దీనికి పేటీఎం పోస్ట్ పెయిడ్ తో తమ కస్టమర్లకు రూ.ఒక లక్ష వరకు క్రెడిట్ లిమిట్ ను కూడా అందిస్తోంది.దీంతో పేటీఎం కస్టమర్లు తమకు నచ్చిన ప్రొడక్టలను కొనుగోలు చేయొచ్చిని పేటీఎం పేర్కొంది.అయితే పేటీఎం పోస్ట్ పెయిడ్ లో మూడు రకాలు ఉంటాయి.అందులో మొదటిది పోస్ట్ పెయిడ్ లైట్ యూజర్లు.వీరికి రూ.20,000 వరకు క్రెడిట్ లిమిట్ ఉంటుంది.క్రెడిట్ స్కోర్ లేని వారు కూడా దీన్ని వాడుకోవచ్చు.
ఇక మిగతవి డిలైట్ అండ్ ఎలైట్ కస్టమర్లు.వీరు రూ.ఒక లక్ష వరకు క్రెడిట్ లిమిట్ వాడుకోవచ్చని పేటీఎం పేర్కొంది.మీకు కూడా కావాలనుకుంటే పేటీఎం యాప్ లో ఒక లుక్ వేయండి.