టీ కు ఫిదా కాని వాళ్లు ఎవరూ ఉండరు.మైండ్ షార్ఫ్ నెస్ కోసం, అలవాటుగా, వర్క్ టెన్షన్ తగ్గడానికి, స్నేహితులతో బయటికి వచ్చినప్పుడు సరదాగా టీ తాగడం అందరికీ ఇష్టం.
మనుషులు టీ తాగడం సహజం.కానీ ఓ బల్లికి పొద్దున్నే టీ తాగకపోతే రోజు గడవదంటూ అనేవారు కూడా చాలా మందే ఉన్నారు.
అయితే ఇక విషయం లోకి వెళితే… బల్లి టీ తాగడం అంటూ ఎవరూ విని ఉండరు.కనీసం చూసి ఉండరు ? అసలు బల్లి ఎక్కడైనా టీ తాగుతుందా.? అని అనుమానించే వాళ్లు చాలా మంది ఉంటారు.
అయితే రాజస్థాన్ లోని భరత్ పూర్ లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.
ఓ బల్లి రోజూ ఉదయాన్నే టీ తాగుతూ వస్తోంది.ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బల్లేంటి.టీ ఎంటీ…? అని అని అనుకుంటున్నారా.అయితే ఆ కథేంటో చూసేద్దాం రండీ.రాజస్థాన్ లోని భరత్ పూర్ లో ఓ కుటుంబం నివాసముంటుంది.ఆ ఇంటి సభ్యులకు ఉదయాన్నే టీ తాగేసి ఇంటి పనులు వెళ్లడం అలవాటు.ఇంటావిడ ఉదయాన్నేలేచి కిచెన్ రూంకి వెళ్లి టీ పెట్టడం మొదలు పెట్టింది.
అయితే టీ సువాసనకు ఓ బల్లి ఫిదా అయింది.కొద్ది రోజులు టీ చేస్తున్న సమయంలో బల్లి ఆ ఇంటావిడ ముందు ప్రత్యక్షమయ్యేది.
అది గమనించిన ఆమె మొదట్లో కసురుకున్న తర్వాత ఏం చేయలేకపోయింది.
రోజూ మాదిరిగానే ఆ రోజు ఇంటావిడ టీ పెట్టడానికి కిచెన్ లోకి వచ్చింది.
కరెక్ట్ అదే సమయంలో బల్లి కూడా వచ్చింది.దీంతో ఆమెకు అనుమానం వచ్చి టీ కోసం వస్తుందా అని ఆలోచించింది.
సరే కదా అని బల్లి కోసం కొంచెం టీ పెట్టేసి బయటున్న కుటుంబ సభ్యుల కోసం టీ ఇవ్వడానికి వెళ్లింది.కుటుంబ సభ్యులందరూ కూర్చొని టీ తాగుతూ… ముచ్చట్లు పెడుతున్నారు.
అందరి టీ తాగడం అయ్యాక ఇంటావిడ కప్పులు తీసుకుని కిచెన్ రూమ్ కి వచ్చింది.తీరా కిచెన్ లో పెట్టిన టీ కొంచెం తగ్గింది.
బల్లి తాగిందని గ్రహించి గత 2 నెలలుగా బల్లికి టీ పోస్తూనే ఉంది ఇంటావిడ.