సాధారణంగా చిన్న ప్రాణులు చిరుతపులి, సింహంలాంటి జంతువులంటే విపరీతంగా భయపడతాయి.పులులు, సింహాలు ఆకలి వేస్తే జంతువును వెంటాడి వేటాడుతున్న విషయం తెలిసిందే.
పులులు, సింహాల అరుపులు వినిపిస్తే చాలు అల్ప ప్రాణులు బిక్కుబిక్కుమంటూ దాక్కునే ప్రయత్నం చేస్తాయి.కానీ ఒక ఉడుం లాంటి అడవి బల్లి మాత్రం తనను చంపడానికి వఛ్చిన చిరుతపులికి చుక్కలు చూపించింది.
తన ప్రాణాలను కాపాడుకోవాలని అడవి బల్లి చిరుతతో పోరాటానికి సిద్ధమైంది.జాంబియాలో చిరుత పులి, అడవి బల్లి మధ్య జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అడవి మార్గంలో వెళుతున్న అడవి బల్లిని మాటు వేసి ఉన్న చిరుత పొదల్లోంచి బయటకు వచ్చి అడవి బల్లిపై దాడి చేసింది.ప్రమాదాన్ని గమనించి అడవి బల్లి ప్రాణాలను రక్షించుకోవటానికి చిరుతను దగ్గరకు రానీయకుండా తన తోకతో కొడుతూ చిరుతతో ఎంతోసేపు పోరాడింది.
అడవి బల్లి చుక్కలు చూపించినా క్రూర మృగమైన చిరుత ఏ మాత్రం తగ్గలేదు.అడవి బల్లిని వదిలిపెట్టకుండా వెంటాడి ఆ తరువాత వేటాడింది.
ఈ ఘటన దాదాపు రెండు సంవత్సరాల క్రితం జాంబియా అడవుల్లో జరిగింది.కానీ అటవీ శాఖ అధికారులు ఈ వీడియోను ఎక్కడా పోస్ట్ చేయకపోవడంతో ఈ వీడియో బయటకు రాలేదు.
తాజాగా ప్రవీణ్ కాశ్వాణ్ అనే ఐ.ఎఫ్.ఎస్ అధికారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
.