మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్ హీరోల ఎవ్వరి నోట విన్న ఒకటే మాట వినిపిస్తుంది.పాన్ ఇండియా సినిమా అని.
అంతగా మన హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఎవ్వరికి అందనంత ఫాస్ట్ గా దూసుకు పోతున్నారు.అయితే తమిళ్ ఇండస్ట్రీలో హీరోలు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు.
కోలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా సినిమాలు చేయడం లేదు.వారు మన తెలుగు మార్కెట్ పై కన్నేశారు.
ఇక్కడ వారి ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారు.అందుకే వరుసగా బైలింగ్వన్ ప్రాజెక్ట్స్ తో ఇక్కడ దిగిపోతున్నారు.
అయితే తమిళ హీరోలకు పోటీగా మన హీరోలు కూడా వాళ్లతో సై అంటూ కాలు దువ్వుతున్నారు.మన యంగ్ హీరోస్ కూడా తెలుగు, తమిళ్ భాషల్లో బైలింగ్వన్ మూవీస్ తో వారికీ గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.
ప్రెసెంట్ తమిళ్ హీరోలలో విజయ్ దళపతి వారసుడు సినిమాతో రాబోతున్నాడు.అలాగే ధనుష్ సార్ సినిమాతో.
శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమాతో మన మార్కెట్ పై పట్టు సాధించాలని ఉవ్విళూరుతున్నారు.దీంతో మన యంగ్ హీరోస్ కూడా అక్కడ మార్కెట్ పై కన్నేశారు.
మన హీరోల్లో రామ్ పోతినేని ప్రెసెంట్ బైలింగ్వన్ సినిమా చేస్తున్నాడు.లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా తెరకెక్కుతుంది.
కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కుతుంది.ఈ సినిమా జులై 14న రిలీజ్ కాబోతుంది.
ఈ సినిమాతో రామ్ కోలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు.
ఆ తర్వాత కూడా రామ్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరొక మూవీ చేయనున్నాడట.ప్రెసెంట్ ఈ సినిమా కథ సిద్ధం అవుతుంది అని త్వరలోనే ఈ సినిమా అనౌన్స్ మెంట్ ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి.అలాగే అక్కినేని నాగ చైతన్య కూడా బైలింగ్వన్ సినిమా చేయబోతున్నాడు.
ఇటీవలే వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేయగా అది తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కనుందట.
అలాగే నాని కూడా ఇదే కోవకు చెందుతాడు.ఈయన ప్రెసెంట్ నటిస్తున్న అన్ని సినిమాలు తమిళ్ లో రిలీజ్ చేస్తున్నాడు.ఇప్పటికే ఆయన నటించిన శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలు అక్కడ కూడా రిలీజ్ అయ్యాయి.
ఇక ఇప్పుడు దసరా కూడా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.ఇంకా మరొక యంగ్ హీరో గోపీచంద్ కూడా త్వరలో హరి దర్శకత్వంలో బైలింగ్వన్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఇలా మన హీరోలు కోలీవుడ్ మార్కెట్ పై కన్నేశారు.