కరోనా పుణ్యమా అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ధర ఆకాశాన్ని అంటిన సంగతి అందరికీ విదితమే.అయితే పొరుగునే ఉన్న మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలోని మద్యం ధరలు చూస్తే ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.
దీంతో అనేకమంది తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కి మద్యాన్ని అక్రమ మార్గాలలో సరిహద్దులు దాటించి బ్లాక్ లో విక్రయించడం జరుగుతోంది.ఇక అసలు విషయంలోకి వెళ్తే…
ఖమ్మం జిల్లా నుంచి కృష్ణా జిల్లా నందిగామకు వెళుతున్న ఓ ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్న కారును పోలీసులు తనిఖీ చేశారు.
పోలీసు తనిఖీలలో ఆ కారులోని మద్యాన్ని చూసి షాక్ కు గురయ్యారు పోలీసులు.తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పందిల్లపల్లి గ్రామానికి చెందిన మల్లీశ్వరి, దివ్యభారతి అనే ఇద్దరు మహిళలు ఊరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న అనేక మద్యం షాపులలో మద్యం బాటిళ్లను భారీగా కొనుగోలు చేశారు.
ఇలా కొన్న వాటిని ఓ టాటా ఇండికా కారులో మొత్తంగా 20 కేసులలో, 1056 మద్యం బాటిళ్లను ఖమ్మం నుండి నందిగామ తరలించే ప్రయత్నాన్ని చేశారు.అయితే ఈ మద్యాన్ని తరలిస్తున్న సమయంలో పోలీసులకు పట్టుబడ్డారు వీరు.పెంట్యాలవారి గూడెం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ఈ కిలాడీ లేడీలు పోలీసులకు దొరికారు.వీరిద్దరిని ప్రస్తుతం వత్సవాయి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో అక్రమ మద్యం తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కృష్ణాజిల్లాలో మద్యం బాటిల్స్ దొరకడం ఇదే అత్యధికం.