తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసం బోనాల పండుగ జరుగుతున్నాయి.ముఖ్యంగా హైదరాబాద్ లో బోనాల జాతర బాగా జరుపుకుంటారు.
ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి జరుగనున్న బోనాల జాతర సందర్భంగా రెండు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేస్తున్నారు.మద్యం షాపులు, బార్లు, కల్లు కాంపౌండ్లు మూసి వేయనున్నారు.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ల పరిధిలో దీనికి సంబందించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.బోనాల జాతర సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి మంగళవారం ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాల మూసివేత అమల్లో ఉంటాయి.
నిషేధిత ప్రాంతాల్లో ఎవరైనా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని పోలీసులు చెబుతున్నారు.అయితే రెండు రోజులు మద్యం దుకాణాలు దొరకవని తెలుసుకున్న జనాలు ముందు జాగ్రత్తగ మద్యం ముందే కొనేసుకుని పెట్టుకుంటున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్ లో శనివరం సాయంత్రం భారీ ఎత్తున మద్యం దుకాణాల ముందు జనాలు ఉన్నారు. పాతబస్తీలోని లాల్ దర్వాజా, అంబర్ పేట లోని మహంకాళీ ఆలయాల్లో ఆది, సోమవారాల్లో బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి.
ఈ రెండు రోజులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్స్ ఆంక్షలు కూడా విధిస్తున్నారని తెలుస్తుంది.