అసలే లాక్ డౌన్ టైం అన్ని వేళలా మందు దొరకడం కష్టం అందుకే మందుబాబుల అవసరాన్ని క్యాష్ చేసుకోవాలని చూశారు ఓ ముఠా.శానిటైజర్ నుండి లిక్కర్ ను తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
లాక్ డౌన్ టైం లో వైన్ షాపులకు తాళం వేసిన సందర్భాల్లో కొందరు శానిటైజర్లు తాగి హాస్పిటల్ బారిన పడ్డ విషయం తెలిసిందే.తమిళనాడులో కుద్దలూరు జిల్లాలో ఆరుగురు వ్యక్తులు శానిటైజర్ నుండి లిక్కర్ తయారు చేస్తూ పోలీసులకు చిక్కారు.
శానిటైజర్ నుండి లిక్కర్ తయారు చేస్తున్నారని తెలిసి సమాచారం అందగా ఆ మేరకు తనిఖీ చేసిన పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులో తీసుకున్నారు.కొద్దిమొత్తంలో శానిటైజర్ తో పాటుగా మిగతా రకరకాల సామాన్లు వారి దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది.
పోలీసులు ఆరా తీస్తే వారు నిజంగానే శానిటైజర్ నుండి లిక్కర్ తయారు చేయాలని ప్రయత్నిచారని తేలింది.పోలీసుల సమాచారం ప్రకారం ఆరోగ్య శాఖా అధికారులు కూడా దీన్ని ధ్రువీకరించడంతో ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సో వైన్ షాపులు ఎలాగు మూతబడ్డాయి కదా అని ఎక్కడపడితే అక్కడ మందు తాగకూడదని మందుబాబులకు ఈ సంఘటన ద్వారా అర్ధమైనట్టే అని చెప్పొచ్చు.