కరోనా వైరస్ నియంత్రించేందుకు లాక్ డౌన్ అమలు చేసిన సంగతి తెలిసిందే.లాక్ డౌన్ సమయం నుంచి ప్రజలు ఎవరు లేరనుకొని అటవీ జంతువులు అన్ని రోడ్లపైకి వచ్చి కనువిందు చేశాయ్.
కొన్ని జంతువులు మనుషులపైన, పెంపుడు జంతువులపైనా దాడులు కూడా చేశాయ్.ఎన్నడూ చూడని సింహాలు, పులుల కూడా రోడ్లపై కనువిందు చేశాయ్.
ఇంకా ఈ నేపథ్యంలోనే గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలోని మోర్జార్ గ్రామంలో రాత్రి సమయంలో ఎక్కడ నుంచి వచ్చాయి అనేది తెలియదు కానీ ఏకంగా ఆరు సింహాల కంటే ఎక్కువే వచ్చాయి.అలా వచ్చిన సింహాలు బస్సు స్టాప్ లో నిద్రపోతున్న గాడిదపై దాడి చేసి చంపేశాయి.
ఆరు సింహాలు ఆ గాడిద శరీరాన్ని ఛిద్రం చేసి ముక్కలు ముక్కలు పట్టుకుపోయాయ్.
ఇది అంత అటుగా వెళ్తున్న వాహనదారులు ఆ దృశ్యాలను చూసి షాక్ అయ్యారు.అయితే సింహాలు వచ్చిన సమయంలో అక్కడ ఎవరు లేరు.ఒకవేళ ఉండి ఉంటే సింహలకు వారు కూడా ఆహారంగా అయ్యేవారు.
ఈ వీడియోను కారులో ఉన్న వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.