గ్రామాల గుండా రహదారులపై వెళ్తుంటే మనకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది.ఎందుకంటే ఈ రహదారులకు ఇరువైపులా ఉండే పచ్చని చెట్లు కనుల విందు చేస్తాయి.
అంతేకాదు వీటి గుండా వెళుతుంటే చల్లటి గాలి గిలిగింతలు పెడుతుంది.అందుకే రూలర్ ఏరియాస్ లో ప్రయాణం చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.
అయితే ఒక్కోసారి ఈ రహదారులే అత్యంత డేంజర్ గా మారుతాయి.ఎందుకంటే అప్పుడప్పుడు అడవి జంతువులు రహదారులపైకి వచ్చేస్తుంటాయి.
అడవుల పక్కనే ఉన్న గ్రామాల్లో మరీ ఎక్కువగా అడవి జంతువులు రహదారులపైకి వచ్చేసి భయబ్రాంతులకు గురి చేస్తాయి.అయితే ఎప్పుడూ చూడని క్రూర మృగాలు ఒకేసారి కళ్లముందు ప్రత్యక్షమైతే ఎవరికైనా సరే గుండె ఆగినంత పనవుతుంది.
తాజాగా అలాంటి భయంకరమైన ఎక్స్ పీరియన్స్ ఇద్దరు వ్యక్తులకు ఎదురయింది.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, గుజరాత్ రాష్ట్రంలో ఒక విలేజ్ రహదారి మీదుగా ఇద్దరు వ్యక్తులు బైక్ పైన ప్రయాణిస్తున్నారు.ఆ రహదారి వెడల్పు చాలా సన్నగా ఉంది.
దీంతో రైడర్ మెల్లగా నడుపుతూ ముందుకు వెళ్తున్నాడు.ఇంతలోనే చెట్ల పొదల్లో నుంచి ఒక పెద్ద ఆడ సింహం బయటకు వచ్చింది.సడన్గా ఎదురైన సింహం చూసి బైక్పై వెళ్తున్న వీరిద్దరూ కూడా షాక్ అయ్యారు.అది తమ వైపు ముందుకు వస్తుంటే ఏం చేయాలో తెలియక దేవుడిపైనే భారం వేశారు.
అయితే అనూహ్యంగా ఆ ఆడ సింహం వారిపై అటాక్ చేయలేదు.జోక్ ఏంటంటే అది వీళ్లని చూసి చూడనట్టుగా రోడ్డు పక్కన ఉన్న పొదల్లో నుంచి వెళ్లిపోయింది.
దీంతో బతుకుజీవుడా అంటూ వాళ్లు అక్కడి నుంచి బయటపడ్డారు.ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద షేర్ చేశారు.
దీనికి ఇప్పటికే 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో అని భయపడిపోతున్నారు.
ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.