సింహాన్ని జూలో చూసి భయపడేవారు ఎంతోమంది ఉంటారు.అడవిలో సింహం గర్జిస్తే వెన్నులో వణుకు పుడుతుంది.
అలాంటి సింహం కళ్ల ముందు ఎదురైతే ఆ మనుషుల పరిస్థితి వర్ణనాతీతం.తాజాగా గుజరాత్ లోని మాధవ్ పూర్ గ్రామస్థులు గ్రామంలోకి సింహం రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు.80 కిలోమీటర్ల వేగంతో వచ్చిన సింహాన్ని చూసి తలో దిక్కుకు వేగంగా పరుగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు.
సింహం పేరు వినగానే గ్రామస్థులు భయంతో ఎవరు ఎక్కడికి పరుగెడుతున్నారో కూడా వారికే అర్థం కానంత వేగంగా పరుగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు.
గ్రామస్థుల అదృష్టం కొద్దీ సింహం ఎవరిపై దాడి చేయకుండానే అక్కడినుండి వెళ్లిపోయింది.సింహం తన దారిన తను దాడి చేయకుండా వెళ్లిపోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
గ్రామంలోని సింహం వచ్చిన వీడియోను ఒక అధికారి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఆ సింహం 80 కిలోమీటర్ల వేగంతో వచ్చిందని… అంత వేగంతో సింహం వస్తే ఉసేన్ బోల్ట్ కూడా సులభంగా తప్పించుకోలేడని అన్నారు.ఉసేన్ బోల్ట్ తప్పించుకుంటాదో లేదో తెలియదు కానీ గ్రామస్థులు సింహం నుండి ఎలా తప్పించుకున్నారో చూడండి అంటూ వీడియోను పోస్ట్ చేశాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.