అమెరికా వంటి దేశాల్లో కనిపించే పొడవాటి కారు శుక్రవారం అమరావతిలో సందడి చేసింది.దైమ్లర్ క్రిస్లర్ కంపెనీకి చెందిన ఈ లిమోజిన్ కారు సర్వహంగులతో సుమారు 20 అడుగుల పొడవు, 300 సీసీ సామర్ధ్యంతో 8 మంది ప్రయాణికుల సీటింగ్తో ఉంది.
హైదరాబాద్కు చెందిన దొండపాటి ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరున ఉన్న ఈ సొగసిరి కారు శుక్రవారం ఉదయం ప్రధాన వీధిలో నుంచి అమరేశ్వరాలయం, సాయిబాబా ఆలయం మీదుగా ధ్యానబుద్ధ ప్రాజెక్టును చేరుకుంది.పొడవాటి కారు రహదారిపై వెళ్తుండగా స్థానికులు ఆసక్తిగా కళ్లు ఆర్పకుండా చూశారు.
.