టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన లైగర్ సినిమా ఈనెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ క్రమంలోనే విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే నటుడు విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే పలు రాష్ట్రాలలో పర్యటిస్తూ పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచాయి.
ఇక ఈ సినిమా కోసం సౌత్ నుంచి నార్త్ వరకు ఎంతో మంది అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో భాగస్వామ్యం అయిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో కరణ్ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ముంబైలో కరణ్ జోహార్ తన స్నేహితుల కోసం ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.అది కూడా ఈ సినిమా విడుదలకు ఒక రోజు ముందుగా ఈ స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నట్లు సమాచారం.ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడంతో 24వ తేదీ ముంబైలో తన స్నేహితుల కోసం ప్రీమియర్ షో వేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా కోసం ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కూడా నటించడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమాతో రౌడీ హీరో ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తారో తెలియాల్సి ఉంది.