కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సమయంలో సినిమా షూటింగ్ లు ఎక్కడికి అక్కడ నిలిచి పోయాయి.మార్చి నెలలో సినిమా షూటింగ్ లు అన్ని కూడా ఆగిపోయాయి.
అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొన్ని సినిమాలు మొదలు కాలేదు.కొన్ని సినిమాలు అప్పుడు ఆగిపోయి మళ్లీ ప్రారంభం అయ్యేనో లేదో తెలియడం లేదు.
ఇక కొన్ని సినిమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యి షూటింగ్ ను ముగించుకున్నాయి.విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ ల సినిమా విషయం ఎటూ తెలియకుండా ఉండి పోయింది.
ఎట్టకేలకు ఆ సినిమా విషయమై కూడా క్లారిటీ వచ్చేసింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లైగర్ సినిమా షూటింగ్ ను వచ్చే నెలలో పునః ప్రారంభించబోతున్నారు.
సినిమాను గత ఏడాది మార్చి నెలలో ముంబయిలో చిత్రీకరిస్తూ నిలిపి వేసిన విషయం తెల్సిందే.కరోనా కారణంగా షూటింగ్ ను ముంబయిలో కాకుండా హైదరాబాద్ లో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు అంటూ వార్తలు వచ్చాయి.
లైగర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే నెల రెండవ వారంలో సినిమాను ముంబయిలోనే పునః ప్రారంభించబోతున్నారు.షూటింగ్ ఎక్కడ అయితే నిలిపేశారో అక్కడ నుండి పునః ప్రారంభం చేయడంతో పాటు అదే రోజు నుండి హీరో మరియు హీరోయిన్ లు విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండేలు జాయిన్ అవ్వబోతున్నారు.ఈ సినిమాను పూరి మరియు ఛార్మిలతో పాటు బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్నాడు.
భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విభిన్నంగా కనిపించబోతున్నాడు.అందుకు సంబంధించిన లుక్ ఇప్పటికే వచ్చేసింది.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుంది.సినిమా లో కొన్ని ముఖ్య సన్నివేశాలు హిందీ స్క్రీన్ కు తగ్గట్లుగా రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.