కరోనా కారణంగా సామాన్యుల దగ్గర నుండి సెలెబ్రిటీల వరకు అందరు బాధపడుతున్నారు.ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలవ్వడం వల్ల మళ్ళీ సినిమాల షూటింగ్ ఆగిపోతుంది.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీ చాలా నష్టాలను ఎదుర్కొంటుంది.మళ్ళీ కరోనా కారణంగా కొంతమంది డైరెక్టర్స్ తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు.
తాజాగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా లైగర్ సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తుంది.
ఈ సినిమా షూటింగ్ కొద్దీ రోజులుగా ముంబైలో జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.
అసలే ముంబైలో రోజుకు లక్షల కేసులు బయట పడుతున్న నేపథ్యంలో పూరీ జగన్నాథ్ అక్కడ జరుగుతున్న షూటింగ్ వాయిదా వేయక తప్పలేదు.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.
అర్జున్ రెడ్డి సినిమాతో ఫేమస్ అయినా విజయ్ ఈ సినిమాతో బాలీవుడ్ లోనూ పరిచయం అవ్వబోతున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాను పూరీ జగన్నాథ్ తో పాటు బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.పూరీ జగన్నాథ్ ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.ఈ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన వచ్చింది.
ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
అందుకే ఈ సినిమా కోసం విజయ్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.ఈ నేపథ్యంలో యాక్షన్ సీన్స్ డిజైన్ కోసం హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.అయితే ఈ సినిమా ను సెప్టెంబర్ 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.