యంగ్ అండ్ సెన్సేషనల్ హీరోగా అంతకంతకు ఎదుగుతున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ..
విజయ్ దేవరకొండకు టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.ఆయన ప్రతి ఒక్కరికి ఫేవరేట్ హీరోగా మారి పోతున్నాడు.
ప్రెసెంట్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్‘ సినిమాతో మరొక నెల రోజుల్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నాడు.
ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
మొదటి సారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు విజయ్ ఇంకా పూరీ.ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో విజయ్ మరింత స్టార్ డమ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు.
ఇక రిలీజ్ కూడా దగ్గర పడడంతో మేకర్స్ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.ఇప్పటికే విజయ్ ముంబై లో పలు ఏరియాల్లో ప్రొమోషన్స్ చేయగా అక్కడి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
దీంతో లైగర్ టీమ్ ఇప్పుడు మరిన్ని ప్రొమోషన్స్ చేయాలని భావిస్తుంది.అందుకే ఆ ప్రొమోషన్స్ కోసం దేశం మొత్తం విజయ్ టూర్ వేసేలా ప్లాన్ రెడీ చేసారు.ఫ్యాన్ డమ్ టూర్ పేరుతో ఆ ప్లాన్ ను మేకర్స్ రివీల్ చేసారు.రేపు ఆగష్టు 11న పూణే లో ఈ టూర్ స్టార్ట్ చేస్తే ఆగష్టు 23న వారణాసి లో ఎండ్ చేయబోతున్నారు.
ఇలా ఇండియా మొత్తం కవర్ చేసేలా విజయ్ ప్రొమోషన్స్ చేయనున్నాడు.మరి గట్టి ప్లాన్ తోనే రాబోతున్నారు కాబట్టి ఓపెనింగ్స్ గట్టిగానే రాబట్టేలాగానే ఉన్నారు.
ఇక మన తెలుగులో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇటీవలే ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా విశేష స్పందన లభించింది.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.