2019 సంవత్సరంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అనన్య పాండే.ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ నటుడు చుంకీ పాండే కూతురు అనే విషయం తెలిసిందే.
బాలీవుడ్ లో అడుగు పెట్టిన మొదటి సంవత్సరం లోనే రెండు సినిమాల్లో నటించింది.ఆ వెంటనే కరోనా కారణంగా అవకాశాలు చాలా తగ్గాయి.
అనుహ్యంగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన లైగర్ సినిమా లో ఈ అమ్మడికి చోటు దక్కింది.పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే అక్కడ ఇక్కడ సత్తా చాటాలని అనన్య పాండే కలలు కన్నది.
కానీ ఆ కలలన్నీ కూడా కల్లలయ్యాయి.లైగర్ సినిమా దారుణమైన పరాజయాన్ని మూట కటుకుంది.
విజయ్ దేవరకొండ తో పాటు అనన్య పాండే కూడా అత్యంత దారుణమైన ట్రోల్స్ ని ఎదుర్కొంది.ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ అమ్మడు చేస్తున్న సినిమా ఒకే ఒక్కటి అదే డ్రీమ్ గర్ల్ 2.ఆ సినిమా కాకుండా మరే సినిమా కూడా ఈ అమ్మడి కి దక్కలేదు.తెలుగు లో కూడా ఈ అమ్మడి యొక్క అందాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు.
సోషల్ మీడియా లో హాట్ ఫోటో షూట్స్ ని షేర్ చేయడం ద్వారా అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తోంది.బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఈ అమ్మడు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
ప్రస్తుతం నటిస్తున్న డ్రీమ్ గర్ల్ 2 సినిమా సక్సెస్ అయితే తప్పితే ఈ అమ్మడికి ఆఫర్స్ వచ్చే పరిస్థితి లేదు.ఇదంతా కేవలం విజయ్ దేవరకొండ తో లైగర్ సినిమా లో నటించడం వల్లే అంటూ ఆమె స్నేహితుల వద్ద చెప్పుకొని బాధపడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అనన్య పాండే కు ఎదురైనా అనుభవం తో చాలా మంది సౌత్ సినిమాల్లో నటించేందుకు భయపడుతున్నారని కూడా టాక్ వినిపిస్తుంది.