దేశంలో కామాంధుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.కామాంధులు వారి కామవాంఛ తీర్చుకోవడం కోసం మృగాల్లా మారి మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్నారు.
వీరి వికృత చేష్టలకు అమ్మాయిల నిండు జీవితాలు బలైపోతున్నాయి.చిన్న పిల్లల నుండి కాటికి కాలు చాపిన ముసలి వాళ్లదాకా అందరు వీరి వేధింపులకు గురవుతూనే ఉన్నారు.
ఒక్కవైపు దేశంలో మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను తీసుకొచ్చినప్పటికీ అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టలేకపోతున్నారు.విజయవాడలో ఓ వృద్ధురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి గురువారం జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తీర్పును వెల్లడించింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.విజయవాడలోని అజిత్సింగ్నగర్ పరిధిలో పిన్నిబోయిన కోటేశ్వరరావు(48) జీవనం సాగించేవాడు.అతను 2016 నవంబరు 27న 77ఏళ్ల వృద్ధురాలిని బెదిరించి ఆమెపై అఘాత్యానికి పాల్పడ్డాడు.బాధితురాలు తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అయితే కోటేశ్వరరావుపై అన్ని ఆధారాలతో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసి న్యాయస్థానంలో అందించారు.
దీంతో న్యాయస్థానం అతడిని దోషిగా నిర్దారణ చేసింది.నిందితుడికి ఐపీసీ 376(1) కింద యావజ్జీవ కారాగార శిక్ష, ఐపీసీ 450 కింద పదేళ్ల జైలు శిక్షని విధించారు.
ఈ కేసుకు సంబంధించి ఐదో అడిషినల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి.ప్రతిభాదేవి గురువారం తీర్పు వెల్లడించారు.