కేసీఆర్ ఈ రోజు ఏపీలోని విశాఖపట్నంలో పర్యటించారు.ఈ సందర్భంగా… ఆయనకు సాదర స్వాగతం లభించింది.
ఇది ఇలా ఉంటే… ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాట సమితి నేతలు.కేసీఆర్కు లేఖ రాశారు.
కేసీఆర్ విశాఖలో పర్యటించిన నేపథ్యంలో ఆయనతో పాటు హైదరాబాద్లోని ప్రగతి భవన్కు లేఖను పంపారు.ఈ సందర్భంగా ప్రత్యేక హోదా పోరాట సమితి నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరికలు, ఆకాంక్షలను ఈ లేఖలో వివరించామని చెప్పారు.
ఆంధ్రా ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడుతుంటే…టీఆర్ఎస్ ఎంపీలు అడ్డుపడుతున్నారని, ఇది ఏపీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకమని అన్నారు.ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ కోసం పోరాడుతుంటే…కావాలనే ఎందుకు తమ ఎంపీలు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు.ఏపీకి వచ్చే ప్రయోజనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ… అడ్డుకోవద్దని వారు లేఖలో కోరారు.
.