మన్యంలో మావోయిస్టుల కరపత్రాల కలకలం

విశాఖ మాన్యంపై మావోయిస్టులు పూర్తి స్థాయిలో గురిపెట్టినట్టు కనిపిస్తోంది.ఇప్పటికే… అరకు ఎమ్యెల్యే కిడారి సర్వేశ్వరరావు , మాజీ ఎమ్యెల్యే సోమాను కాల్చి చంపిన మావోలు తమ ఉనికి కోసం అనేక అలజడులు సృష్టిస్తూనే ఉన్నారు.తాజాగా.విశాఖ మన్యంలో మావోయిస్టుల పేరిట కరపత్రాలు, బ్యానర్లు కనిపించడం కలకలం సృష్టించాయి.గూడెం కొత్తవీధి మండలం ఆర్‌వీ నగర్‌ వద్ద సోమవారం తెల్లవారుజామున వీటిని వెదజల్లినట్లు సమాచారం.

 Letter Relised By Mavoyists At Visaka Manyam-TeluguStop.com

చట్టాల ప్రకారం అడవిపై హక్కు ఆదివాసీలదే అయినప్పటికీ అంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ది సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) శ్రమ దోపిడీకి పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు.బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టి గిరిజనుల బతుకులను నాశనం చేయడానికి పూనుకున్న అధికార తెదేపా, భాజపా నాయకులను మన్యం నుంచి తరిమి కొట్టాలని మావోయిస్టులు ఆ కరపత్రాల్లో పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube