భారత సంతతి వ్యక్తిగా , బ్రిటన్ ఆర్ధిక మంత్రిగా అత్యంత కీలకమైన పదవిలో ఉన్న రిషి సునక్ పై వేట పడనుందా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం బ్రిటన్ రాజకీయాల్లో ఈ విషయం హాట్ టాపిక్ అవుతోంది.
బ్రిటన్ భవిష్యత్తు రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్న రిషి సునక్ పై ఇప్పుడు ఈ తరహా విమర్శలు రావడం చర్చనీయాంశం అయ్యింది.రిషి సునక్ పై ప్రధాని బోరిస్ కోపంగా ఉన్నారని, తాజాగా జరిగిన మంత్రివర్గ అంతర్గత సమావేశంలో రిషి పై బోరిస్ ఫైర్ అయ్యారని తెలుస్తోంది.
ఇంతకీ బోరిస్ రిషి సునక్ పై ఈ స్థాయిలో ఫైర్ అవ్వడానికి కారణం ఏంటంటే.
కరోనా మహమ్మారి ప్రస్తుతం దాదాపు అన్ని దేశాలలో తగ్గుముఖం పట్టింది.
ఈ సమయంలో అన్ని దేశాలు విదేశీప్రయాణీకులపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి.ఈ క్రమంలోనే అంతర్జాతీయ నిభంధనలను సడలించాలని రిషి సునక్ ప్రధాని బోరిస్ కు లేఖను రాశారు.
ఈ ఆంక్షలు సడలించక పొతే ఆర్ధికంగా ప్రభుత్వం నష్టం చవి చూస్తుందని, ఇప్పటికే ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడుతోందని తెలిపారు.అయితే ఈ లేఖ ప్రధాని వద్దకు చెరక ముందే, ప్రధాని చూడక ముందే మీడియా కు లీక్ అయ్యింది.
అది కాస్తా వార్తా మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యింది.
దాంతో ప్రధాని బోరిస్ ఈ లేఖ తనకు రాకుండానే మీడియా లో కనపడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.హడావిడిగా మంత్రులు, అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసిన బోరిస్ అందరి ముందే రిషి సునక్ పై మండిపడ్డారని తెలుస్తోంది.అంతేకాదు రిషి సునక్ ఆర్ధిక మంత్రిగా కంటే ఆరోగ్య మంత్రిగా పనిచేస్తే బాగుంటుంది అంటూ చురకలు అంటించారట.
అందరూ రిషిని ఆరోగ్య మంత్రిగా చూసే సమయం వచ్చిందని కూడా వ్యాఖ్యానించారట బోరిస్.దాంతో రాబోయే మంత్రి వర్గ విస్తరణలో రిషి సునక్ ను ఆర్ధిక శాఖ నుంచీ తప్పించి ఆరోగ్య శాఖ ఇస్తారనే వార్తలు ఊపందుకున్నాయి.
ఇదిలాఉంటే రిషి సునక్ పై బోరిస్ ఆగ్రహం వ్యక్తం చేసి ఉండవచ్చు కానీ ఆర్ధిక మంత్రిగా తొలగించి డిమోట్ చేస్తారని అనుకోవడం లేదని, రిషి అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.