అక్కడ కలుద్దాం అంటూ ప్రభాస్ కి గుడ్ బై చెప్పిన పూజా హెగ్డే!

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో పూజా హెగ్డే ఒకరు.ఈ ఏడాది ప్రారంభంలో అలా వైకుంఠపురం సినిమా తో కొట్టిన ఈ బుట్టబొమ్మ తరువాత వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు.

 Lets Meet That Hero In Hyderabad Actress Pooja Hegde Pooja Hegde, Meet, Prabhas,-TeluguStop.com

చేతి నిండా సినిమాలతో తీరిక క్షణం లేకుండా గడుపుతున్న పూజా హెగ్డే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన, జిల్ ఫేమ్ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసినదే.

అయితే ఇప్పటికే ఈ సినిమా పూర్తి కావాల్సి ఉండగా కరోనా లాక్ డౌన్ సమయంలో చిత్ర నిర్మాణం వాయిదా పడ్డ విషయం తెలిసిందే.

లాక్ డౌన్ తరువాత తిరిగి చిత్ర నిర్మాణం ఇటలీ షెడ్యూల్ ను ప్రారంభించింది.ఈ చిత్ర నిర్మాణం కోసం దాదాపు నెల రోజుల పాటు ఇటలీలోని షూటింగ్ లో పాల్గొని తన భాగం చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు.

తనపై సన్నివేశాలు పూర్తవడంతో, పూజా హెగ్డే ఇటీవలే ఇటలీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు.

పూజా హెగ్డే ఇటలీ షెడ్యూల్ను పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు తనఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పూజా తెలియజేశారు.

ఇటీవలే రాధేశ్యామ్ ఇటలీ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయిన సందర్భంలో ఆమె చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ నేపథ్యంలోనే హీరో ప్రభాస్ కు తిరిగి హైదరాబాద్ లో కలుద్దామని పూజా పేర్కొన్నారు.

ఇటలీ షెడ్యూల్ ఎంతో బాగా ఎంజాయ్ చేసినట్లు ఈ సందర్భంగా పూజా హెగ్డే తెలిపారు.తన పుట్టినరోజు వేడుకలు కూడా ఇటలీలోనే చిత్రబృందం మధ్య ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

ఆమె పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ప్రేరణ ఫస్ట్ లుక్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.అయితే అటు ప్రభాస్ అభిమానులు, ఎటు పూజా హెగ్డే అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube