యాచారంలో పరిధిలో నక్కర్తపల్లిలో చిరుత గ్రామంలోకి ప్రవేశించినట్లు తెలుస్తుంది.గత కొంత కాలంగా చిరుతలు అటవీప్రాంతం నుంచి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.
చిరుతలు జనావాసాల్లో చేరి ప్రజలని భయబ్రాంతులకి గురి చేయడం, దాడి చేయడం, అలాగే పశువులపై దాడి చేయడం చేస్తున్నాయి.ఆ మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది.
అటవీప్రాంతంకి ఆనుకొని వుండే గ్రామాలలో ప్రజలు చిరుతల దాడికి గురవుతున్నారు.
తాజాగా తెలంగాణలో యాచారం పరిధిలో కూడా నక్కర్తపల్లి గ్రామంలోకి చిరుత ప్రవేశించడంతో ఆ గ్రామస్తులు తీవ్ర భయాందోళకి గురవుతున్నారు.
ఇప్పటికే గ్రామంలో పశువులపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలుస్తుంది.ఇక గ్రామస్తుల నుంచి చిరుత సంచారం గురించిన సమాచారం అటవీశాఖ అధికారులకి తెలియజేయడంతో దానిని పట్టుకునే ప్రయత్నం ఇప్పుడు అటవీశాఖ సిబ్బంది చేస్తున్నారు.