మృత్యువు మీదకు దూకినప్పుడు ఎవరికైనా గుండె ఆగినంత పనైపోతుంది.ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది.
కాని ఆ సమయంలో మెరుపు వేగంతో ఆలోచిస్తే ప్రాణాలతో బయట పడే అవకాశం ఉంటుంది.ఇప్పుడు చెప్పబోతున్న సంఘటన అలాంటి కోవకే వస్తుంది.
అత్యంత భయానకంగా ఉన్న ఈ సంఘటనలో ఇద్దరు తృటిలో ప్రాణాలతో బయట పడ్డారు.ఇద్దరి ప్రాణాలను బలికొనేందుకు పులి చేసిన ప్రయత్నం విఫలం అయ్యింది.
ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద ఒక వీడియోను షేర్ చేశాడు.ఆయన తన టీం తో కలిసి అడవిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఒక పులి కనిపించింది.రోడ్డు పక్కన పొదల్లో ఆ పులి ఉండగా తన కారును నిలిపేసి అక్కడే చూస్తూ ఉన్నాడు.ఆ సమయంలోనే ఒక టూ వీలర్ పై ఇద్దరు కుర్రాళ్లు వెళ్తున్నారు.
వారిని ఆపేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు.వారు సరిగ్గా తనకు దగ్గరకు వచ్చిన సమయంలో పులి రోడ్డు మీదకు ఒక్క పరుగున వచ్చేసింది.
ఆ బండిపైకి తన పంజా విసిరేందుకు ప్రయత్నించింది.అలాంటి సమయంలో అనూహ్యంగా బైక్ నడుపుతున్న వ్యక్తి స్పీడ్ పెంచాడు.వెంట్రుక వాసిలో ప్రమాదం తప్పింది.పులి కాలు లేదా పంజా ఏది తలిగినా కూడా బండి కింద పడేది.వెంటనే ఆ ఇద్దరు మనుషులను పులి చంపేసేది.ఇదంతా ఆయన వీడియోలో చిత్రీకరించి పోస్ట్ చేశాడు.
అది కాస్త వైరల్ అయ్యింది.ప్రస్తుతం వైరల్ వీడియోలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరై ఉంటారా అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.