ఒకప్పుడు చిరుత పులులు అడవిలో ఉండడం తప్ప జనావాసాలలోకి వచ్చే అవకాశమే లేకపోయేది.కాని ప్రస్తుతం పరిస్థితి తారుమారయింది.
అడవులను నాశనం చేస్తుండడం వల్ల అవి అడవులను వదిలి జనావాసాలలోకి వచ్చి మనుషులపై దాడి చేస్తున్నాయి.ఈ మధ్య ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి.
మనకు సాధారణంగా పులులు వస్తున్నప్పుడు కనుక్కోవచ్చు.కాని చిరుత పులులు వస్తున్నప్పుడు చిన్న శబ్దం కూడా కాకుండా అవి బయట సంచరిస్తూ ఉంటాయి.
అయితే తాజాగా ఇలాంటి ఘటన సూరత్ నగరంలోని పాల్ సూరత్ ఏరియాలోకి చిరుత పులి వచ్చింది.
అలా పెట్రోల్ బంక్ కు వచ్చింది.
అక్కడ ఆ సమయంలో రాత్రి కావడంతో పెట్రోల్ బంక్ కు ఎవరూ రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అలా పెట్రోల్ బంక్ గోడను దూకి లోపలికి వెల్లింది.
అక్కడ ఉన్న కుక్కపై దాడి చేసి తిందామని ప్లాన్ చేసింది.అయితే చిరుతపులి రావడాన్ని చివరికి గమనించని కుక్క చివరి సమయంలో సరిగ్గా వాసన రావడంతో వెనక్కి తిరిగి చూసే సరికి చిరుతపులి కనబడడంతో చిరుత పులిని చూసి ఒక్కసారిగా కుక్క తప్పించుకుంది.
కాని కుక్క గట్టిగా అరవడంతో చిరుతపులి కుక్కను వదిలివేసి వెళ్ళిపోయింది.ఏది ఏమైనా అడుగడుగునా చిరుతపులుల సంచారంతో జనం బెంబేలెత్తుతున్నారు.
.