దుబ్బాక( Dubbaka ) బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు( Raghunandan Rao ) ఐఆర్బి సంస్థ సోమవారం లీగల్ నోటీసులు పంపింది.వెయ్యి కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది.
ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ లో అవకతవకలు జరిగాయని రఘునందన్ రావు కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేశారు.ఐఆర్బి అనే సంస్థ బ్లాక్ లిస్టులో ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్లాక్ లిస్టులో ఉన్న సంస్థకు ఏ విధంగా టెండర్లు కట్టబెడతారు.? ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.
30 ఏళ్ల పాటు ఓఆర్ఆర్ సంస్థకు( IRB ) లీజుకి ఇవ్వటం సరైనది కాదు.అని ప్రశ్నించారు.
ఈ కామెంట్స్ నీ ఐఆర్బి సంస్థ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలతో తమకు పరువు నష్టం జరిగిందని… కంపెనీ లీగల్ నోటీసులు జారీ చేసింది.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బ్లాక్ లిస్టులో లేని సంస్థను… ఉందని చెప్పటం న్యాయం కాదని సంస్థ వ్యాఖ్యానించింది.పరువు నష్టం జరిగిందంటూ రఘునందన్ పై ₹1000 కోట్లకు దావా వేసింది ఐఆర్బి సంస్థ…
.