ఆ మధ్య చైనా లో ఒక వ్యక్తి చెవిలో బొద్దింకలు ఏకంగా గూడు కట్టేసి నివాసం ఏర్పరచుకున్న ఘటన గురించి గుర్తుఉండే ఉంటుంది.ఈ ఘటన సోషల్ మీడియా లో ఎంతగా వైరల్ అయ్యిందో అందరికీ తెలిసిందే.
చెవిలో బొద్దింకలు గూడు కట్టి కాపురం కూడా పెట్టాయని అతడి చెవి ని క్లీన్ చేసిన వైద్యులు తెలిపారు.అయితే ఇప్పుడు తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
అదేంటంటే ఒక వ్యక్తి ముక్కు కుడిభాగంలో రెండు జలగలు ప్రత్యక్షమయ్యాయి.ఈ ఘటన కూడా చైనా లోనే చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే….చైనా లో ఒకవ్యక్తి గత రెండు నెలలుగా విపరీతమైన దగ్గు తో బాధపడుతున్నాడు.
అతడు దగ్గుతున్నప్పుడు రక్తం కూడా పడుతుండడం తో అతడు కంగారు పడి డాక్టర్ ని కూడా సంప్రదించాడు.దీనితో డాక్టర్ సీటీ స్కాన్ చేయగా అతడి గొంతులో ఎలాంటి సమస్య కనిపించలేదు.
దీనితో అతడికి ఇంకా ఆ సమస్య తగ్గకపోవడం తో డాక్టర్స్ అతడికి బ్రానో స్కోపీ చేయడం తో అసలు విషయం బయటపడింది.అతడు ముక్కు కుడిభాగంలో,గొంతులో రెండు జలగలు ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
దీనితో వెంటనే అతడికి మత్తు ఇచ్చి ఆ రెండు జలగలను బయటకు తీసేసినట్లు వైద్యులు తెలిపారు.అయితే కొండ ప్రాంతంలో నివాసముంటున్న వ్యక్తి కావడం తో కొద్దీ నెలల క్రితం అతడు జలగలు ఉన్న నీటిని తాగి ఉంటాడని, అలా అవి అతని శరీరంలో ప్రవేశించి ఉంటాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఆ జలగలు నెలల నుంచి వ్యక్తి రక్తాన్ని తాగుతూ.అతడి శరీరం లోపలే పది సెంటీమీటర్లు పెరిగినట్టు వైద్యులు తెలిపారు.మొత్తానికి నీరు ద్వారా జలగలు అతడి శరీరం లోకి చేరి అతడి రక్తాన్ని పీల్చేసి అతడిని అస్వస్థతకు గురిచేశాయి.