అగ్ర రాజ్యం అమెరికాలో ఎలాంటి విపత్తులు లేకపోతే తెల్లారదు కాబోలు, రోజు ఏదో ఒక సమస్య అమెరికాను వెంటాడుతూనే ఉంటుంది.కరోనా మొదటి వేవ్ మొదలు ఇప్పటి వరకూ మహమ్మారి అమెరికాపై తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది.
మరో పక్క తుపాకి చప్పుళ్ళు, ఇంకోపక్క జాత్యహంకార దాడులు, ఇవన్నీ మర్చిపోక ముందే, అనేక రకాల వ్యాధులు, మరో పక్క లక్షల ఎకరాల అటవీ భూమి అగ్నికి ఆహుతైపోవడం ఇలా ఎన్నో సమస్యలు అమెరికాను చుట్టుముడుతూనే ఉంటాయి.ఈ క్రమంలోనే తాజాగా.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా పెద్ద ఎత్తున అగ్ని పర్వతం బద్దలయ్యిందా అన్నట్టుగా మంటలు ఎగసి పడుతుండటంతో ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయాందోళనలకు లోనయ్యి ఇళ్ళలో నుంచీ బయటకు పరుగులు తీశారు.ఈ ఘటనపై స్థానిక మీడియా వెల్లడించిన కధనం ప్రకారం.
కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓ నగరంలో మధ్యాహ్నం సమయంలో ఓ స్టీల్ ప్లాంట్ లో మంటలు రేగాయి, మంటలు రేగిన మరుక్షణంలోనే అవి చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడం మొదలు పెట్టాయి.
ఈ మంటలు దాదాపు 200 ఎకరాల వరకూ విస్తరించడంలో ఆ ప్రాంతంలో ఉండే అత్యంత ఖరీదైన లక్షల డాలర్లు విలువ చేసే భవనాలు అగ్నికి బూడిదైపోయాయి.
ఫైర్ సిబ్బంది మంటలను ఆపడానికి ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిందని ఈ క్రమంలో అగ్ని మాపక సిబ్బందిలోని ఒకరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చేరారని, అధికారులు తెలిపారు.ఈ ప్రాంతంలో దాదాపు 100 ఇళ్ళకు పైనే ఉన్నాయని ఈ మంటల్లో అవన్నీ కాలిపోయాయని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని పోలీస్ అధికారులు వెల్లడించారు.
అయితే ఈ మంటలుఎలా వ్యాపించాయి అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు.