దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే వైరస్ ప్రభావం మహారాష్ట్రలో ఎక్కువగా ఉందన్న సంగతి తెలిసిందే.దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులలో సగానికి పైగా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడం జరిగింది.అయితే కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్న ఉండటంతో.
మహారాష్ట్రలో రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆసుపత్రిలో సరైన వైద్యం అందక బెడ్లు కొరతతో పాటు ఆక్సిజన్ కొరత కూడా ఉంది.
పరిస్థితి ఇలా ఉండగా మహారాష్ట్ర నాసిక్ లో డాక్టర్ జాకీర్ హుస్సేన్ హాస్పిటల్ వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఆక్సిజన్ ట్యాంకర్ లీకేజ్ అయి 11మంది రోగులు మృతి చెందారు.
ఈ దారుణమైన సంఘటన జరిగిన ప్రాంతం వద్ద గ్యాస్ మొత్తం వ్యాపించడంతో చుట్టుప్రక్కల ప్రజలు మరియు హాస్పిటల్ ల భయాందోళన వాతావరణం నెలకొంది.హాస్పిటల్ కి సంబంధించిన ట్యాంకర్ లో ఆక్సిజన్ నింపుతున్న సమయములో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగిందట.
దీంతో సమాచారం అందుకుని రెస్క్యూ టీంపరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసింది.